తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 (Telangana Rising Global Summit 2025) ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ (Hyderabad) లో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సమిట్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. సమిట్ లో తెలంగాణలో పెట్టుబడుల, యువతకు ఉపాధి అవకాశాల, సాంకేతిక, విద్య, ఆరోగ్యం, హెల్త్ టూరిజం రంగాల గురించి వివిధ సెషన్లలో చర్చ జరుగుతుంది. దాదాపు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరై, రాష్ట్ర అభివృద్ధికి, గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడంలో చర్చల ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమిట్ ప్రారంభ సభలో ప్రసంగిస్తారు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తారు. సమిట్ వేదికను అత్యాధునిక డిజిటల్ టన్నెల్స్, కళాకృతులు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే స్టాల్స్ తో అలంకరించారు.
Read also: Global Summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై నాగార్జున కీలక వ్యాఖ్యలు
Global Summit 2025
1,000 కంటే ఎక్కువ CCTV కెమెరాలు
సమిట్ లో నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖ CEOs, కేంద్ర మంత్రులు, సినీ రంగ ప్రతినిధులు పాల్గొని తమ సందేశాలను ప్రసారం చేస్తారు. విద్య, వైద్య, టెక్, గ్రీన్ ఎనర్జీ, ఎకనామీ, స్టార్టప్, సృజనాత్మక రంగాలపై 27 విభిన్న సెషన్లు జరగనుండగా, అతిథుల భద్రతకు 2,500 మంది పోలీసులు, 1,000 కంటే ఎక్కువ CCTV కెమెరాలు, ప్రత్యేక మహిళా బృందాలు ఏర్పాటుచేశారు. సమిట్ ముగింపు రోజున సాయంత్రం డ్రోన్ల ద్వారా తెలంగాణ అభివృద్ధి, విజన్ 2047 లక్ష్యాలను ఆకాశంలో ప్రదర్శించడం జరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: