Gas Shortage: ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావంతో భారత్కు రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరా మార్గాల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) లభ్యత తగ్గి, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది.
Read Also :Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్కు QR కోడ్.. ఆ వివరాలన్నీ మీ ఫోన్లోనే!
దశాబ్ద కాలంలోనే భారీ కేటాయింపు
గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ఆయిల్ మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల అవసరాల నిమిత్తం అదనంగా 40 వేల కిలోలీటర్ల కిరోసిన్ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. గత పదేళ్ల కాలంలో ఇంధన కోటాను ఈ స్థాయిలో పెంచడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గ్యాస్ సిలిండర్ల వాడకం పెరిగిన తర్వాత కిరోసిన్ కోటాను క్రమంగా తగ్గిస్తూ వచ్చిన ప్రభుత్వం, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ భారీగా పెంచింది.
త్వరలో మరిన్ని కమర్షియల్ సిలిండర్లు
కేవలం గృహ అవసరాలకే కాకుండా, వాణిజ్య అవసరాల కోసం కూడా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చింది. మార్కెట్లో డిమాండ్ను బట్టి త్వరలోనే మరిన్ని కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీనివల్ల హోటళ్లు, ఇతర చిన్న పరిశ్రమలకు గ్యాస్ ఇబ్బందులు కలగకుండా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇంధన కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. కిరోసిన్ మరియు గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను అరికట్టే బాధ్యత రాష్ట్రాలదేనని, ప్రజలకు సరుకులు సక్రమంగా అందేలా నిఘా పెంచాలని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :