ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి భవిష్య నిధి (Epfo) ఖాతాలకు సంబంధించిన సేవలు అందిస్తామని ముందుకొచ్చే మధ్యవర్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని, తమ చందాదార్లను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) (Epfo) హెచ్చరించింది. కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. సేవలను వేగంగా, పారదర్శకంగా, వినియోగదారు హితంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ వరుసగా సంస్కరణలు చేపడుతోందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
7 కోట్ల మందికి పైగా చందాదార్లు..
ఈపీఎఫ్ఓలో సుమారు 7 కోట్ల మందికి పైగా చందాదార్లు ఉన్నారు. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఉన్నారు. పలు సైబర్ కేఫ్ ఆపరేటర్లు/ఫిన్టెక్ కంపెనీలు చందాదార్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, సేవలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వాస్తవానికి ఈ సేవలన్నీ ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్లో చందాద
థర్డ్-పార్టీలకు అనుమతి లేదు
ఈపీఎఫ్ఓ సంబంధిత సేవలు అందించేందుకు థర్డ్-పార్టీ కంపెనీలు, మధ్యవర్తులు ఆర్థిక వివరాలు తీసుకుని.. వాటిని దుర్వినియోగం చేస్తే చందాదార్ల నష్టపోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలాంటి సేవలు అందించేందుకు బయటి సంస్థలు/వ్యక్తులకు ఈపీఎఫ్ఓ (Epfo) అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సమస్యలు ఉంటే, సీపీజీఆర్ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ఐజీఎంస్ పోర్టళ్లలో తెలియజేస్తే, వాటికి పరిష్కారం నిర్ణీత సమయంలో లభిస్తుందని వివరించింది.
2024-25లో ఫిర్యాదులు
2024-25లో ఈపీఎఫ్(Epfo) ఐజీఎంస్ పోర్టల్లో 16,01,202 ఫిర్యాదులు, సీపీజీఆర్ఏఎంఎస్లో 1,74,328 ఫిర్యాదులు రాగా, 98% పరిష్కరించినట్లు తెలిపింది. చందాదార్లు, యాజమాన్య సంస్థలు, పింఛనుదార్లు ఆన్లైన్ సేవల కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్లను వినియోగించుకోవాలని సూచించింది.
EPFO నూతన సంస్కరణలు
సేవలు వేగంగా, పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ (Epfo) వరుసగా మార్పులు చేస్తోంది. డిజిటల్ సేవలపై నమ్మకాన్ని పెంపొందించడానికి భద్రతా చర్యలు, ఫిర్యాదు వ్యవస్థలు బలోపేతం చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ సేవలు పొందేందుకు మధ్యవర్తుల అవసరం లేదు. చందాదారులు నేరుగా అధికారిక వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఉచితంగా, సురక్షితంగా సేవలు పొందవచ్చు. మోసపూరితంగా డబ్బులు వసూలు చేసే సంస్థల నుండి తప్పించుకోవడం మిత్రుల బాధ్యత.
Read Also: Stock Market: స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభం