📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 4, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Property Tax : ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50 శాతం రాయితీ ప్రకటించగా, శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు వచ్చాయి. మొత్తంగా పట్టణ, స్థానిక సంస్థల్లో గత ఐదు రోజుల్లో రూ.204 కోట్లు వసూలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఇది నగదు కొరతతో బాధపడుతున్న మున్సిపల్ సంస్థలకు పెద్ద ఊరటనిస్తోంది. 26వ తేదీన రూ.32 కోట్లు, 27వ తేదీన రూ.40 కోట్లు, 28వ తేదీన రూ.38 కోట్లు, 29వ తేదీన రూ.60 కోట్లు, 30వ తేదీన రూ.34 కోట్లు వసూలు అయ్యాయి.

ఈరోజు సెలవు అయినా పన్ను వసూళ్లు

రంజాన్‌ కారణంగా ఈరోజు సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది పండుగ కావడంతో ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేకపోయారు. అయితే ఇవాళ ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ మాఫీపై మున్సిపల్ అధికారులు భారీ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.

మరో రూ.15 కోట్లు వసూలవుతుందని అంచనా

కాగా, మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డుస్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూలేనంతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.478.63 కోట్లు వసూలైంది. సోమవారం వరకు గడువుండడంతో మరో రూ.15 కోట్లు వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. జీవీఎంసీ చరిత్రలో ఇదే అత్యధిక వసూలని రెవెన్యూశాఖ అధికారులు పేర్కొనడం విశేషం.

Ap Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Property Tax Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.