తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) జాతీయ రాజకీయాల్లో క్రమంగా తన సత్తా చాటుకుంటున్నారు. వరుస పర్యటనలు, ముఖ్యమైన సమావేశాలు,ఇండియా కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్నారు.తాజాగా ఆయన ఈరోజు చెన్నైలో పర్యటించనున్నారు.
తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న “మహా విద్యా చైతన్య ఉత్సవ్” (“Maha Vidya Chaitanya Utsav”) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు.

Medaram: వేగవంతంగా మేడారం అభివృద్ధి పనులు
సాయంత్రం జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ (Hyderabad) కు రానున్నారు.ఈ పర్యటనకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది. బీహార్ రాజధాని పాట్నాలో నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress Working Committee) సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే
ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.త్వరలో బీహార్, వచ్చే ఏడాది తమిళనాడు (Tamil Nadu) సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: