రైతులు సాగు కోసం ఉపయోగించే పురుగుమందులపై ప్రస్తుతానికి 18% GST విధించబడింది. దీనివల్ల రైతుల వ్యయం ఎక్కువవుతోంది. ఈ బడ్జెట్లో దీన్ని 5% కి తగ్గించే సూచనలు వినిపిస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఇవి విలాస వస్తువులు కాకుండా పంటకు అవసరమైన మందులు (Plant Medicines). ఇప్పటికే బయో-పెస్టిసైడ్స్ పై ప్రభుత్వం పన్ను తగ్గించింది.
Read also: road accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి
Will these 3 changes come to the agricultural sector
పోషకాహార పంటలకు ప్రోత్సాహం
మన శరీరానికి అవసరమైన జింక్, ఐరన్ వంటి పోషకాల కొరత ‘హిడెన్ హంగర్’ అని పిలుస్తారు. ఈ సమస్యను తగ్గించడానికి బయోఫోర్టిఫైడ్ విత్తనాలు (Biofortified Seeds) ఉపయోగించాలని సూచనలు ఉన్నాయి. దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, రైతులకు కూడా మార్కెట్ లో మంచి ధర లభిస్తుంది.
వ్యవసాయ పరిశోధనలకు పెద్దపీట
భారతదేశం వ్యవసాయ పరిశోధనలో GDP లో కేవలం 0.7% మాత్రమే ఖర్చు చేస్తోంది. చైనా, అమెరికా (America) వంటి దేశాలతో పోలిస్తే ఇది తక్కువ. Budget 2026 లో పరిశోధనలకు నిధులు పెంచి, ప్రైవేట్ రంగ పరిశోధనలకూ పన్ను మినహాయింపులు ఇవ్వాలని పరిశ్రమ నాయకులు కోరుతున్నారు. ఇది సాంకేతికత అభివృద్ధికి, రైతుల దిగుబడిని పెంచడానికి సహాయపడుతుంది.
ఎరువుల స్వయం సమృద్ధి
ఇప్పటికీ మనం ఎరువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. ఈ బడ్జెట్లో బయో-ఫెర్టిలైజర్ రంగానికి Production Linked Incentive (PLI) Scheme ను విస్తరించాలి అని డిమాండ్ ఉంది. ఇది దేశంలోనే ఎరువుల ఉత్పత్తి పెంచుతుంది, ప్రభుత్వ సబ్సిడీ భారాన్ని తగ్గిస్తుంది. రైతుల కొరకు నాణ్యమైన ఎరువులు అందుబాటులోకి వస్తాయి.
ఆధునిక వ్యవసాయం కోసం అవకాశాలు
Budget 2026 కేవలం అంకెల విషయం కాదు. ఇది రైతులకు మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ అందించే గొప్ప అవకాశం. రైతులు నాణ్యమైన, పోషకాహార పంటలు పండిస్తే, మన దేశం భవిష్యత్తులో ప్రపంచానికి “పోషకాహార గని” గా నిలుస్తుంది. సరైన మద్దతు, నిధులు, పరిశోధనలు రైతులకి లాభకరంగా మారుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: