రిలయన్స్ జియో, భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) మధ్య ఇటీవల కుదిరిన భాగస్వామ్యత్వం టెలికాం రంగంలో కొత్త తరంగాలు సృష్టించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో, తన కనెక్టివిటీని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థ BSNLతో చేతులు కలిపింది.జియో (Jio), (BSNL) తమ నెట్వర్క్ కవరేజీని విస్తరించడానికి భాగస్వామ్యం చేసుకున్నాయి.
Read Also: Stock market: లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు
సిగ్నల్ లేని మారుమూల ప్రాంతాలలో
దీని ప్రకారం, జియో సిగ్నల్ లేని మారుమూల ప్రాంతాల్లోని వినియోగదారులు ఇప్పుడు BSNL నెట్వర్క్ను ఉపయోగించుకోవచ్చు,జియో కస్టమర్లు బలమైన నెట్వర్క్ను పొందుతారు. జియో వినియోగదారులు తరచుగా సిగ్నల్ లేని మారుమూల ప్రాంతాలలో కూడా ఇప్పుడు BSNL నెట్వర్క్ ద్వారా సులభంగా కాల్స్ చేయవచ్చు.
ఇంటర్నెట్ను కూడా యాక్సెస్ చేయవచ్చు. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో విస్తరించవచ్చు.ఈ ఒప్పందం వల్ల జియో వినియోగదారులు మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు.టెలికామ్టాక్ నివేదిక ప్రకారం.. జియో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్లతో BSNL ICR సేవ అందుబాటులో ఉందని తెలిపింది.
జియో వినియోగదారులు ఎంపిక చేసిన
ఈ ప్లాన్లతో జియో వినియోగదారులు ఎంపిక చేసిన ప్రదేశాలలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కు కనెక్ట్ అవ్వవచ్చు. అదే భౌగోళిక ప్రాంతంలో వాయిస్, డేటా,SMS సేవలను ఉపయోగించవచ్చు.ఈ ప్లాన్లు జియో వినియోగదారులకు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ (ICR)ని అనుమతిస్తాయి.
జియో కనెక్టివిటీ తక్కువగా ఉన్న లేదా ఉనికిలో లేని మారుమూల లేదా గ్రామీణ ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కు కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ ప్లాన్లు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని వినియోగదారుల కోసం ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: