📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

APSRTC: సంక్రాంతి రద్దీతో ఆర్టీసీకి భారీ ఆదాయం

Author Icon By Pooja
Updated: January 21, 2026 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి పండగ ప్రయాణాలు ఏపీఎస్‌ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టాయి. జనవరి 19 ఒక్కరోజే ఆర్టీసీకి రూ.27.8 కోట్ల ఆదాయం వచ్చింది. సెలవులకు ముందు, తర్వాత వరుసగా వారాంతాలు రావడం సంస్థకు కలిసొచ్చిందని అధికారులు వెల్లడించారు.

Read Also:WEF 2026: ఏపీలో RMZ పెట్టుబడులతో లక్షల ఉద్యోగ అవకాశాలు

APSRTC: The Sankranthi rush has brought huge revenue to the RTC.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రత్యేక సర్వీసుల ప్రభావం

జనవరి 8 నుంచి 19 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా మొత్తం రూ.18.19 కోట్ల ఆదాయం సమకూరింది. రోజుకు సగటున 735 ప్రత్యేక బస్సులు, మరోవైపు 1,012 సాధారణ సర్వీసులు నడిపారు. ఈ బస్సులు(APSRTC) సుమారు 40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. జనవరి 10 నుంచి 13 వరకు రోజుకు వెయ్యి బస్సులు తిరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజుల్లో సగటున రోజుకు రూ.1.52 కోట్ల ఆదాయం వచ్చింది.

గతేడాదితో పోలిస్తే భారీ వృద్ధి

గతేడాది ఇదే కాలంలో 12 రోజులకు రూ.15.15 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.3.04 కోట్లు పెరిగి రూ.18.19 కోట్లకు చేరింది. ఇందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి రూ.15.53 కోట్లు, కృష్ణా జిల్లా నుంచి రూ.2.66 కోట్లు రాబడి వచ్చింది.

స్త్రీశక్తి పథకంతో పెరిగిన ప్రయాణికులు

స్త్రీశక్తి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మొత్తం ప్రయాణికుల్లో 70 శాతం పైగా మహిళలే ఉన్నట్లు అంచనా. గతంలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న సర్వీసుల్లో ఇప్పుడు సగటున 75 శాతం నమోదు అవుతోందని అధికారులు తెలిపారు.

ఆర్టీసీ పునరుజ్జీవనానికి బలంగా పథకాలు

స్త్రీశక్తి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఆర్టీసీకి చెల్లించనుంది. దీంతో సంస్థ(APSRTC) ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది. కొత్త బస్సులు, ప్రత్యేక కార్యాచరణతో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu RTCIncome SankrantiTravel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.