ఉండవల్లి గుహల వద్ద ఉచిత (AP free transport scheme) బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబుదేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. (AP free transport scheme) ఎన్నికల వాగ్దానాల్లో కూటమి ‘సూపర్ సిక్స్’ హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నది.
నేడు స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేడు అమలు చేయనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. నిత్యం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బస్సులో రాకపోకలు సాగించే మహిళలకు ఛార్జీల భారం నుంచి ఉపశమనం కల్పించనున్నారు. ఇంటర్ మొదలుకొని ఉన్నత విద్య వరకూ చదువుకునే విద్యార్థినులు ఇకపై బస్ పాస్లు కొనాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. దీంతో నిరుపేద మహిళలు, కూలీ పనులు చేసుకునే మహిళలకు ఈ పథకం వల్ల ఎంతో ఊరట లభించనున్నది.
5 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు.
ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు పల్లె వెలుగు, అల్ట్రాపల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ వంటి 5 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకాతిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ వంటి ప్రధాన ఆలయాలకు వెళ్లాలనుకున్నా బస్ ఛార్జీల భారం కారణంగా వెళ్లలేనివారే అధికం. ఇకపై ఇటువంటి కుటుంబాల్లో మహిళలకు బస్ఛార్జీల భారం లేకపోవడంతో తక్కువ ఖర్చుతో ఆలయాలకు వెళ్లి వచ్చేందుకు అవకాశం కలగనుంది.