రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఊహించని షాక్ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబైలోని ఆయన అత్యంత విలాసవంతమైన నివాసం ‘అబోడ్’ (Abode) ను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. పాలి హిల్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ 17 అంతస్తుల లగ్జరీ భవనం విలువ సుమారు రూ. 3,716 కోట్లు ఉంటుందని అంచనా. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా జప్తుతో కలిపి, ఈ కేసులో అనిల్ అంబానీకి సంబంధించి ఇప్పటివరకు ఈడీ అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 15,700 కోట్లకు చేరడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్
గత కొంతకాలంగా అనిల్ అంబానీ వివిధ ఆర్థికపరమైన ఆరోపణలు, విచారణలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్తో ఉన్న సంబంధాలు, విదేశీ నిధుల మళ్ళింపు ఆరోపణలపై గతేడాది ఆగస్టులో ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా ఆయన నివాసాన్ని అటాచ్ చేయడం అనేది విచారణలో కీలక పురోగతిగా భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఈడీ అధికారులు అనిల్ అంబానీని మరోసారి ఢిల్లీకి పిలిపించి విచారించే అవకాశం ఉంది. ఒకప్పుడు దేశంలోని సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అనిల్ అంబానీ, ఇప్పుడు తన సొంత నివాసాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి రావడం దేశ ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com