📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Anil Ambani: అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ

Author Icon By Sharanya
Updated: August 2, 2025 • 10:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) కి సంబంధించి కేంద్ర అన్వేషణ సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Ed) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు రూ.17 వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి విచారణలో భాగంగా ఆయనపై లుకౌట్ నోటీసు జారీ చేసింది. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని కోరడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Anil Ambani

విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు

ఈ నెల 5వ తేదీన అనిల్ అంబానీ (Anil Ambani) ని విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై ఆయన స్పందించకముందే, దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని నిరోధించేందుకు ఈడీ నిన్న లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

లుకౌట్ నోటీసుల ప్రభావం – దేశం విడిచే అవకాశం లేదూ

సాధారణంగా ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా (Without leaving the country) ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంటారు. లుకౌట్ నోటీసులు జారీ అయిన వ్యక్తులు దేశం విడిచి వెళ్లడానికి అవకాశం ఉండదు. ఒకవేళ వారు దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నిస్తే విమానాశ్రయాలు, సీ పోర్టులు, ఇతర మార్గాల వద్ద పాస్‌పోర్టుల తనిఖీల సందర్భంలో గుర్తించి అదుపులోకి తీసుకుంటారు.

గత నెలలో భారీ దాడులు – 50 సంస్థలపై సోదాలు

ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న 50 కంపెనీలపై ఈడీ అధికారులు గత నెల 24వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు దాడులు నిర్వహించారు. బ్యాంకుల నుంచి నిధులు మంజూరు అయ్యే సమయంలో ప్రమోటర్లు ముందుగా భారీ మొత్తంలో నగదు అందుకున్నట్లు కూడా ఆధారాలు లభించినట్టు సమాచారం.

లుకౌట్ నోటీసు జారీ కావడంతో అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ అత్యవసరంగా బిజినెస్ పని మీద వేరే దేశానికి వెళ్లాల్సి వస్తే ఈడీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

బిజినెస్ ప్రపంచంలో కలకలం

అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. రిలయన్స్ ఇన్ ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణం మంజూరు చేయడానికి ముందు బ్యాంక్ ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు అందినట్లు ఈడీ గుర్తించింది.

read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/girish-kousgi-to-leave-pnb-housing-finance/international/524088/

anil ambani Breaking News Corporate Scams ED investigation latest news Lookout Notice reliance group Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.