రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) కి సంబంధించి కేంద్ర అన్వేషణ సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Ed) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు రూ.17 వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి విచారణలో భాగంగా ఆయనపై లుకౌట్ నోటీసు జారీ చేసింది. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని కోరడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.

విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు
ఈ నెల 5వ తేదీన అనిల్ అంబానీ (Anil Ambani) ని విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై ఆయన స్పందించకముందే, దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని నిరోధించేందుకు ఈడీ నిన్న లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
లుకౌట్ నోటీసుల ప్రభావం – దేశం విడిచే అవకాశం లేదూ
సాధారణంగా ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా (Without leaving the country) ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంటారు. లుకౌట్ నోటీసులు జారీ అయిన వ్యక్తులు దేశం విడిచి వెళ్లడానికి అవకాశం ఉండదు. ఒకవేళ వారు దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నిస్తే విమానాశ్రయాలు, సీ పోర్టులు, ఇతర మార్గాల వద్ద పాస్పోర్టుల తనిఖీల సందర్భంలో గుర్తించి అదుపులోకి తీసుకుంటారు.
గత నెలలో భారీ దాడులు – 50 సంస్థలపై సోదాలు
ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న 50 కంపెనీలపై ఈడీ అధికారులు గత నెల 24వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు దాడులు నిర్వహించారు. బ్యాంకుల నుంచి నిధులు మంజూరు అయ్యే సమయంలో ప్రమోటర్లు ముందుగా భారీ మొత్తంలో నగదు అందుకున్నట్లు కూడా ఆధారాలు లభించినట్టు సమాచారం.
లుకౌట్ నోటీసు జారీ కావడంతో అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ అత్యవసరంగా బిజినెస్ పని మీద వేరే దేశానికి వెళ్లాల్సి వస్తే ఈడీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
బిజినెస్ ప్రపంచంలో కలకలం
అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. రిలయన్స్ ఇన్ ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణం మంజూరు చేయడానికి ముందు బ్యాంక్ ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు అందినట్లు ఈడీ గుర్తించింది.
read hindi news: hindi.vaartha.com
Read also: