ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి(Anil Ambani) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) మరియు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సంస్థల్లో ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆయనకు చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కి పైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
Read Also: Chevella Accident: కంకర బరువే ప్రాణాంతకం

జప్తు చేసిన ఆస్తులు, కేసు నేపథ్యం
జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, న్యూఢిల్లీలోని రిలయన్స్ సెంటర్తో పాటు, ఢిల్లీ, నోయిడా, ముంబై,(Mumbai) పుణె, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో విస్తరించిన పలు నివాస, వాణిజ్య భవనాలు, భూములు ఉన్నాయి.
- కేసు నేపథ్యం: 2017-19 మధ్యకాలంలో యెస్ బ్యాంక్ ఈ రిలయన్స్ ఫైనాన్స్(Reliance Finance) సంస్థల్లో పెట్టుబడి పెట్టింది. అయితే, 2019 డిసెంబర్ నాటికి ఈ పెట్టుబడులు నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మారాయి.
- మోసం తీరు: మ్యూచువల్ ఫండ్లలోని ప్రజాధనాన్ని సెబీ నిబంధనలను తప్పించుకుని, పరోక్షంగా యెస్ బ్యాంక్ ద్వారా ఆర్హెచ్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ఎల్ సంస్థలకు మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ రుణాల మంజూరులో ఎలాంటి తనిఖీలు లేకుండానే “స్పీడ్-ప్రాసెస్” జరిగిందని, కొన్నిసార్లు దరఖాస్తు చేయడానికి ముందే నిధులు విడుదలయ్యాయని ఈడీ గుర్తించింది. దీనిని ఈడీ “ఉద్దేశపూర్వకమైన, స్థిరమైన నియంత్రణ వైఫల్యాలు”గా అభివర్ణించింది.
ఆర్కామ్, రికవరీపై దర్యాప్తు
ఈడీ తన దర్యాప్తును రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్) కు కూడా విస్తరించింది. ఇందులో రూ.13,600 కోట్లకు పైగా “వ్యవస్థీకృత రుణ మోసాలు” జరిగినట్లు గుర్తించింది. ఈ నేరంలో భాగమైన మరిన్ని ఆస్తులను గుర్తించే పని కొనసాగుతోందని, జప్తు చేసిన ఆస్తుల ద్వారా రికవరీ చేసిన మొత్తం చివరికి ప్రజలకే చెందుతుందని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: