📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

పసిడి దిగుమతుల ఆల్ టైమ్ రికార్డ్

Author Icon By Sudheer
Updated: December 16, 2024 • 8:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత లో పసిడి దిగుమతులు నవంబర్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నవంబర్ లో 14.8 బిలియన్ డాలర్ల పసిడి దిగుమతులు నమోదు కావడం గమనార్హం. కానీ అదే సమయంలో వాణిజ్య ఎగుమతులు తగ్గుముఖం పట్టడం ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తోంది. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతులు 4.85 శాతం తగ్గాయి. 2023 నవంబర్‌లో ఎగుమతులు 33.75 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2024 నవంబర్‌లో 32.11 బిలియన్ డాలర్లకు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దిగుమతులు మాత్రం గణనీయంగా పెరిగాయి. గత ఏడాది నవంబర్ నెలలో 55.06 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ నవంబర్ నెలలో 69.95 బిలియన్ డాలర్లకు చేరుకుని 27 శాతం వృద్ధి చెందాయి.

ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్య లోటును తీవ్రంగా పెంచింది. వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 2.17 శాతం వృద్ధి చెంది 284.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతులపై నియంత్రణ చర్యలు తీసుకోవడం అవసరమని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.

పసిడి దిగుమతుల వృద్ధి దేశవ్యాప్తంగా వినియోగంలో పెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, వాణిజ్య లోటు పెరగడం ఆర్థిక రంగంలో ప్రధాన సవాల్‌గా మారింది. దిగుమతులను తగ్గించడానికి సర్కారు ప్రత్యేక పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

all time record gold material imports

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.