📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు కెనరా బ్యాంక్ కొత్త యాప్

హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు — రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

Author Icon By Uday Kumar
Updated: December 17, 2024 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

*హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు — రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోకి బయట ఆహారాన్ని తీసుకుకరానివ్వొద్దని బీసీ సంక్షేమ శాఖాధికారుల, హాస్టల్ సిబ్బందిని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 13 మంది బాలికలు స్వల్ప అసస్థతకు గురయ్యారు. రాంపురం ప్రాథమిక వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం మంగళవారం ఉదయం వారిని డిశ్చార్జి చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత…విద్యార్థినులతోనూ, వైద్యులతోనూ, గురుకుల సిబ్బందితోనూ ఫోన్లో మాట్లాడారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని మంత్రితో వైద్యులు తెలిపారు. విద్యార్థినులంతా కోలుకున్నారని, వారిని డిశ్చార్జి చేశామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం హాస్టల్ లోనే విద్యార్థినులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు గురుకుల సిబ్బంది తెలిపారు. బాలికలను డిశ్చార్జి చేసినా హాస్టల్ లోనే వైద్యుల పర్యవేక్షలోనే ఉంచాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. గురుకుల పాఠశాలల మిగిలిన విద్యార్థినుల పరిస్థితిపైనా మంత్రి ఆరా తీశారు. వారంతా బాగున్నారని, ఆదివారం కావడంతో, హాస్టల్ చుట్టు పక్కల ఉన్న షాపుల నుంచి కూడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసి విద్యార్థినులు తిన్నారని తెలిపారు. అటువంటి వారే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. దీనిపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం చేశారు. హాస్టల్ లోకి బయట ఆహారం తీసుకురానివ్వొదని ఆదేశించారు. విద్యార్థినులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్ నుంచి బయటకు వెళ్లనీయొద్దని మంత్రి సవిత ఆదేశించారు.

#AndhraPradesh #hostel #savitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.