📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

సంచలనాత్మక అధ్యయనాన్ని ఆవిష్కరించిన డోజీ..

Author Icon By sumalatha chinthakayala
Updated: October 25, 2024 • 6:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏఐ -ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి దిగజారటాన్ని దాదాపు 16 గంటల ముందుగానే అంచనా వేస్తుంది..

ఈ ప్రతిష్టాత్మక అధ్యయనం, భారతదేశంలోని టెరిషియరీ కేర్ లో అతిపెద్ద అధ్యయనాలలో ఒకటి, ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించడం, ప్రాణాలను రక్షించడం మరియు హెల్త్ ఏఐ తో అందరికీ చేరువచేయగల , సరసమైన, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడంలో డోజీ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

బెంగుళూరు : భారతదేశ ఆరోగ్య ఏఐ నాయకునిగా ఖ్యాతి గడించిన డోజీ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ మెడికల్ టెక్నాలజీలో ప్రచురించబడిన తమ మైలురాయి అధ్యయనం యొక్క ఫలితాలను ఆవిష్కరించింది. ఈ జర్నల్ ప్రతిష్టాత్మక ఫ్రాంటియర్స్ గ్రూప్ లో భాగం. ఈ అధ్యయనం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కెజిఎంయు)లో నిర్వహించబడింది మరియు భారతీయ టెరిషియరీ కేర్ లో ఈ తరహా అతిపెద్ద పరిశీలనా అధ్యయనాలలో ఇది ఒకటి. ఈ అధ్యయనం డోజీ యొక్క ఏఐ – శక్తివంతమైన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యుఎస్) యొక్క సంచలనాత్మక ప్రభావాన్ని వెల్లడించింది, రోగి ఆరోగ్యం క్షీణించడాన్ని 16 గంటల ముందుగానే అంచనా వేయగల దాని సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది, తద్వారా ముందస్తుగా జోక్యం చేసుకోవడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి ఒక క్లిష్టమైన అవకాశాన్ని ఆరోగ్య సంరక్షణ నిపుణులకు అందిస్తుంది.

దాదాపు రెండు మిలియన్ (20 లక్షలు) హాస్పిటల్ బెడ్‌లు ఉన్న దేశంలో, సాధారణ వార్డులలో సుమారు 1.9 మిలియన్ల మంది రోగులు పర్యవేక్షణ కోసం మాన్యువల్ స్పాట్ చెక్‌లపై ఆధారపడతారు, డోజీ యొక్క ఏఐ -పవర్డ్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ మరియు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యుఎస్) ఒక విప్లవాత్మక పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ సాంకేతికత 95% ఆసుపత్రి సామర్థ్యంలో సంరక్షణను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఐసియు సేవల ఖర్చులో స్వల్ప ఖర్చుతోనే ప్రపంచ-స్థాయి ఆరోగ్య సంరక్షణను నిర్ధారిస్తూ ప్రాణాలను కాపాడే నిరంతర పర్యవేక్షణను అందిస్తుంది.

ఈ మార్గదర్శక పరిశీలనా అధ్యయనం 85,000 గంటలలో 700 మంది రోగులను పర్యవేక్షించింది మరియు డోజీ యొక్క నిరంతర కాంటాక్ట్‌లెస్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ మరియు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఈడబ్ల్యుఎస్ ) సాంప్రదాయ మాన్యువల్ ప్రక్రియలను ఎలా విప్లవాత్మకంగా మారుస్తుందో ప్రదర్శించింది. క్లిష్టమైన ఆరోగ్య సంఘటనలకు 16 గంటల ముందుగానే హెచ్చరికలను అందించడం ద్వారా, డోజీ వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ నిపుణులను ముందుగా స్పందించటానికి అవకాశం ఇస్తుంది, ఇది ఆరోగ్య సంరక్షణ అభ్యాసకులకు స్టాఫ్ మెంబర్ కు రోజుకు 2.4 గంటలు ఆదా చేస్తూ రోగి ఫలితాలను సైతం మెరుగుపరుస్తుంది. హెచ్చరిక సున్నితత్వం, నిర్దిష్టత, ప్రారంభ హెచ్చరిక నుండి క్షీణత వరకు సగటు సమయం మరియు ఆరోగ్య సంరక్షణ అభ్యాసకుల కార్యకలాపాలతో సహా కీలకమైన కొలమానాలను ఈ అధ్యయనం విశ్లేషించింది, ఇది డోజీ యొక్క ప్రాణాలను రక్షించే ప్రభావానికి బలమైన క్లినికల్ సాక్ష్యాలను అందిస్తుంది.

అనేక భారతీయ ఆసుపత్రులలో, నిరంతర పర్యవేక్షణ అనేది ఐసియులకు పరిమితం చేయబడింది, మెజారిటీ రోగులు ఉండే సాధారణ వార్డులు వదిలివేయబడుతున్నాయి. ఇక్కడ గుర్తించబడని క్లినికల్ క్షీణతకు రోగులు గురయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా హృదయ స్పందన రేటు, శ్వాసకోశ రేటు మరియు రక్తపోటు వంటి ప్రాణాధారాలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా డోజీ యొక్క ఈడబ్ల్యుఎస్ ఈ అంతరాన్ని భర్తీ చేస్తుందని ఈ అధ్యయనం నిరూపిస్తుంది. ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం డోజీ యొక్క ఈడబ్ల్యుఎస్ 67% నుండి 94% కేసులలో రోగి క్షీణతను అంచనా వేసింది, పరిస్థితులు క్లిష్టంగా మారడానికి ముందుగానే ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు జోక్యం చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ ముందస్తు గుర్తింపు సంవత్సరానికి 21 లక్షల మంది ప్రాణాలను కాపాడుతుంది మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను రూ. 6400 కోట్లు వరకూ తగ్గించగలదు.

అధ్యయనం నుండి కీలక ఫలితాలు:

· డోజీ యొక్క ఈడబ్ల్యుఎస్ రోగుల ఆరోగ్యం క్షీణించడం గురించి 16 గంటల ముందుగానే హెచ్చరించింది
· నిరంతర పర్యవేక్షణ వల్ల ఆరోగ్య సంరక్షణ నిపుణుల సమయం 10% ఆదా అవుతుంది, ఇది రోజుకు 2.4 గంటలకు సమానం.

కెజిఎంయు వద్ద మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ హిమాన్షు దండు మాట్లాడుతూ వనరుల-నియంత్రిత వాతావరణంలో క్లిష్టమైన సంరక్షణను

మెరుగుపరచడంలో సాంకేతికత యొక్క సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. “ఈ వ్యవస్థ, ముందస్తుగా గుర్తించడం మరియు నిరంతర రోగి పర్యవేక్షణను అనుమతిస్తుంది, భారీగా రోగి భారాన్ని ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల డిమాండ్‌లకు అనుగుణంగా కొలవదగిన మరియు సరసమైన పరిష్కారాన్ని ఇది అందిస్తుంది. రోగి ఆరోగ్యం క్షీణించే సంకేతాలను గుర్తించే సామర్థ్యం వారి మనుగడ రేటును గణనీయంగా మెరుగుపరుస్తుంది..” అని అన్నారు.

పారిస్-సాక్లే విశ్వవిద్యాలయం నుండి ప్రపంచ ప్రఖ్యాత ఇంటెన్సివిస్ట్ మరియు క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ జీన్-లూయిస్ టెబౌల్, అధ్యయనం యొక్క ప్రపంచ ప్రభావాలను నొక్కిచెప్పారు, “భారతదేశంలో మనం సాధించినది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను పునర్నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సవాళ్లు భిన్నంగా ఉండవచ్చు, కానీ సమానమైన, సమయానుకూలమైన మరియు సరసమైన సంరక్షణ అవసరం సార్వత్రికమైనది…” అని వెల్లడించారు.

“ఈ అధ్యయనం యొక్క ఫలితాలు మేము ఎప్పటినుంచో విశ్వసిస్తున్న వాటిని ధృవీకరిస్తున్నాయి-ఈ వాస్తవ ప్రపంచ సాక్ష్యం ఆరోగ్య సంరక్షణను మరింత సమర్థవంతంగా, అందుబాటులోకి తీసుకురావటం తో పాటుగా సమానమైనదిగా మార్చడానికి సాంకేతికత యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది” అని డోజీ యొక్క సిటిఓ & సహ-వ్యవస్థాపకుడు శ్రీ గౌరవ్ పర్చాని అన్నారు. . “మేము భారతదేశానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడం మాత్రమే కాదు, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం పునాది సైతం వేస్తున్నాము” అని అన్నారు

కెజిఎంయు కి చెందిన డాక్టర్ హిమాన్షు దండు మరియు డాక్టర్ అంబుజ్ యాదవ్‌తో పాటు డోజీ యొక్క క్లినికల్ రీసెర్చ్ టీమ్ శ్రీ గౌరవ్ పర్చాని, డాక్టర్ కుమార్ చోకలింగం, మరియు Ms పూజా కదంబి, ఇంటెన్సివిస్ట్ మరియు మాజీ ISCCM అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ మిశ్రా మరియు బంగ్లాదేశ్ నుండి ఐసియు మరియు ఎమర్జెన్సీ కి ఇన్‌ఛార్జ్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అహ్సినా జహాన్ సహా ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతుల బృందం ఈ అధ్యయనం లో కీలక పాత్ర పోషించింది. ఇది డాక్టర్ జీన్-లూయిస్ టెబౌల్, పారిస్-సాక్లే మెడికల్ యూనివర్శిటీ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ప్లైమౌత్ నుండి డాక్టర్ జోస్ ఎమ్. లాటూర్ నుండి సహకారంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. డోజీ యొక్క ఆరోగ్య ఏఐ జాతీయ పరిష్కారం కంటే ఎక్కువ అందిస్తుంది అని అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతున్నాయి; ఇది ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అంతరాలను పరిష్కరిస్తుంది. సాంప్రదాయ నమూనాలు నిలకడలేనివని రుజువు చేస్తున్నాయి మరియు డోజీ యొక్క వ్యవస్థ ఆరోగ్య సంరక్షణను డిజిటలైజ్ చేయడమే కాకుండా అంతర్జాతీయ స్వీకరణకు బ్లూప్రింట్‌గా ఉపయోగపడే సరళమైన, వ్యాప్తి చేయగల మరియు సరసమైన పరిష్కారాన్ని అందిస్తుంది.

A.I AI-based early warning Dozee Groundbreaking Study patients Health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.