📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

Author Icon By Vanipushpa
Updated: January 9, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మండిపడ్డారు. తమ పార్టీ ప్రతిపాదించిన పథకాలను ఆపేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ ఫిర్యాదు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ శనివారం దీనిపై స్పందించారు.

బీజేపీ, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘బీజేపీకి నేరుగా వ్యవహరించే ధైర్యం లేకపోవడంతో కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌తో ఫిర్యాదు చేయించింది. ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి’ అని మీడియాతో అన్నారు.

పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు రూ.2,100, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ రెండు పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ‘ఇప్పటికే లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపట్ల బీజేపీ భయాందోళనలకు గురవుతోంది’ అని ఆయన విమర్శించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.