‘ఐ &బి సీడ్స్’ ను సొంతం చేసుకోవటం ద్వారా కూరగాయలు మరియు పూల విత్తనాల రంగంలో అడుగుపెట్టిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్

Read Time:  1 min
Crystal Crop Protection entered the vegetable and flower seed sector by acquiring IB Seeds
Crystal Crop Protection entered the vegetable and flower seed sector by acquiring IB Seeds
FONT SIZE
GET APP

.అధిక-విలువైన కూరగాయలు మరియు పూల విత్తనాల మార్కెట్‌లో క్రిస్టల్ కార్యకలాపాలను ఈ సముపార్జన బలపరుస్తుంది.

.క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఇప్పుడు అగ్రి ఇన్‌పుట్‌లో అంటే పంట రక్షణ, వ్యవసాయ క్షేత్రం మరియు కూరగాయల విత్తనాల మార్కెట్ లో ముఖ్యమైన సంస్థగా నిలిచింది.

న్యూఢిల్లీ : ప్రముఖ వ్యవసాయ సంబంధిత పరిష్కారాల సంస్థ అయిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ తమ 12వ కొనుగోలును ప్రకటించింది, ఇండస్ మరియు ఎస్ పి ఎస్ బ్రాండ్‌లతో బంతి పూల విత్తనాలలో నాయకత్వ స్థానాన్ని కలిగి ఉన్న, పూలు మరియు కూరగాయల విత్తనాల మార్కెట్‌లో ప్రముఖ సంస్థ అయిన ఐ &బి సీడ్స్‌ను కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక చర్య , క్రిస్టల్ తన విత్తనాల వ్యాపారాన్ని వైవిధ్యపరచడానికి మరియు అధిక-విలువైన కూరగాయలు మరియు పూల విభాగాలలో తమ కార్యకలాపాలను విస్తరించటానికి, పరిశ్రమలో కంపెనీని బలీయమైన సంస్థగా ఉంచడానికి అనుమతిస్తుంది.

ఈ విభాగాల్లోకి విస్తరించడం ద్వారా, దిగుబడి మరియు లాభదాయకతను పెంచే అధిక-నాణ్యత గల కూరగాయలు మరియు పూల విత్తనాలను రైతులకు అందించడం క్రిస్టల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ కొనుగోలు, విత్తన సాంకేతికతలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడం మరియు పంట వైవిధ్యాన్ని పెంచడం ద్వారా విస్తృత వ్యవసాయ భూభాగానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఫలితంగా, రైతులు సాగు కోసం మెరుగైన అవకాశాలను కలిగి ఉంటారు, వ్యవసాయ రంగంలో మెరుగైన ఆహార భద్రత మరియు ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తారు.

ఈ కొనుగోలుపై క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అంకుర్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఈ కొనుగోలు మా వృద్ధి వ్యూహంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. క్రిస్టల్ వద్ద, మేము మా రైతుల శ్రేయస్సు కోసం లోతుగా కట్టుబడి ఉన్నాము. కూరగాయలు మరియు పూల విత్తనాల విభాగాలకు విస్తరించడం ద్వారా, మేము మా ఆవిష్కరణలను వైవిధ్యపరచడమే కాకుండా, రైతులకు ఆదాయాన్ని గణనీయంగా పెంచే అధిక-నాణ్యత గల విత్తనాలను అందించే మా సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నాము. దిగుబడులు మరియు లాభదాయకతను మెరుగుపరిచే వినూత్న పరిష్కారాలతో రైతులకు సాధికారత కల్పించడం, వారి సాగు అవసరాలకు ఉత్తమమైన వనరులను పొందేలా చేయడంపై మేము దృష్టి సారించాము. పూల మరియు కూరగాయల విత్తనాల మార్కెట్‌లో ఐ&బి సీడ్ యొక్క నైపుణ్యం, పంటలలో మా బలమైన పోర్ట్‌ఫోలియోతో కలిపి, వ్యవసాయ సమాజానికి మెరుగైన సేవలందించడానికి మరియు భారతదేశం అంతటా స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు దోహదపడడానికి మాకు వీలు కల్పిస్తుంది..” అని అన్నారు.

క్రిస్టల్ యొక్క ప్రస్తుత విత్తనాల పోర్ట్‌ఫోలియోలో పత్తి, మొక్కజొన్న, సజ్జలు , ఆవాలు, పశుగ్రాసం , గోధుమలు, బెర్సీమ్ మరియు జొన్న వంటి పొలాల్లోని పంటలలో ప్రో ఆగ్రో, సదానంద్, సర్‌పాస్, డైరీ గ్రీన్ వంటి రైతులు ఇష్టపడే బ్రాండ్‌లు ఉన్నాయి. ఐ&బి సీడ్స్ కూరగాయలు మరియు పూల విభాగాలను కొనుగోలు చేయడంతో ఇండస్ మరియు ఎస్ పి ఎస్ బ్రాండ్‌ల జోడింపు కూడా జరుగుతుంది. తద్వారా క్రిస్టల్ తన ఉత్పత్తులను మరింత విస్తృతం చేస్తుంది మరియు మరింత మంది రైతులకు తన పరిధిని విస్తరిస్తుంది. కొత్త వ్యాపారం క్రిస్టల్ యొక్క విత్తనాల విభాగాన్ని పెంచుతుందని అంచనా వేయబడింది, దాని టాప్‌లైన్ వృద్ధిలో 30% పెరుగుదలకు దోహదం చేస్తుంది.

ఐ&బి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ నూజిబైల్ మాట్లాడుతూ.. “క్రిస్టల్ యొక్క విస్తృతమైన వనరులు మరియు పంపిణీ నెట్‌వర్క్‌తో పువ్వులు మరియు కూరగాయల విత్తనాలలో ఐ&బి సీడ్ వారసత్వాన్ని మిళితం చేయడానికి క్రిస్టల్ సీడ్స్‌కు ఈ కొనుగోలు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. క్రిస్టల్ యొక్క పరిమాణం మరియు బలం భారతదేశం అంతటా మరియు వెలుపల ఉన్న రైతులకు వినూత్నమైన మరియు అధిక-నాణ్యత గల విత్తనాలను వేగవంతం చేయడంలో సహాయపడతాయి, మెరుగైన దిగుబడి మరియు లాభదాయకతను నిర్ధారిస్తాయి..” అని అన్నారు.

డబ్ల్యు. అట్లీ బర్పీ కంపెనీ ఛైర్మన్ మరియు ఐ&బి సీడ్స్‌ భాగస్వామి అయిన శ్రీ జార్జ్ బాల్ కూడా ఐ&బి సీడ్ యొక్క ఆర్&డి రైతులకు పెద్ద స్థాయిలో చేరుకోవడానికి మరియు వారికి మంచి పంటలు పండించడంలో సహాయపడటానికి ఒక గొప్ప అవకాశం అని పేర్కొన్నారు.

వ్యూహాత్మక సముపార్జనల ద్వారా అకర్బన వృద్ధిని క్రిస్టల్ చురుకుగా కొనసాగిస్తోంది. ఇది మొత్తంగా కంపెనీ యొక్క పన్నెండవ కొనుగోలు మరియు విత్తనాల వ్యాపారంలో ఐదవది. మునుపటి కొనుగోళ్లలో 2023లో కోహినూర్ సీడ్స్ నుండి సదానంద్ పత్తి విత్తన పోర్ట్‌ఫోలియో మరియు 2021లో బేయర్ నుండి పత్తి, సజ్జలు, ఆవాలు మరియు జొన్న పోర్ట్‌ఫోలియో ఉన్నాయి. 2018 మరియు 2022 మధ్య, క్రిస్టల్ అనేక అగ్రోకెమికల్ మరియు సీడ్స్ బ్రాండ్ లను ప్రముఖ బహుళ జాతి కంపెనీలు అయిన ఎఫ్ ఎం సి మరియు డౌ-కోర్టెవా తదితరుల నుంచి కొనుగోలు చేసింది. అదనంగా, కంపెనీ 2018లో సాల్వే గ్రూప్ నుండి తయారీ సౌకర్యాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్ ఆధారిత ఆర్థిక సలహా సంస్థ అర్థ ఆర్బిట్రేజ్ కన్సల్టింగ్, ఈ లావాదేవీపై ఐ & బి కి సలహా ఇచ్చింది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.