हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పిన హైడ్రా

Sudheer
మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పిన హైడ్రా

రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. ఆల్వాల్ ప్రాంతంలో ప్రభుత్వం భూమిని ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు అందింది. సిబ్బంది తక్షణం అక్కడ పరిశీలనలు జరిపి, అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. వెంటనే బుల్డోజర్‌తో అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేశారు. అక్కడ “ఇది ప్రభుత్వ భూమి” అని బోర్డు ఏర్పాటు చేశారు.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో కూడా హైడ్రా అధికారులు చర్యలకు దిగారు. చెరువుల భూములను ఆక్రమించి నిర్మించిన హద్దు గోడలను జేసీబీలతో తొలగించారు. ఖాళీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులన్నింటిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో ప్రజల నుండి ఫిర్యాదులు అధికంగా రావడం ప్రారంభమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అలాగే హైడ్రా అధికారులు సైతం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే తక్షణమే సమాచారం అందించాలని, ఆ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870