జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఏమీ లేవు – ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత

Read Time:  1 min
Janwada Farm house
Janwada Farm house
FONT SIZE
GET APP

ఉదయం నుండి జన్వాడ ఫామ్‌హౌస్‌ రేవ్ పార్టీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఆధ్వర్యంలో ఈ పార్టీ జరగడం..ఈ పార్టీ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడం తో రాష్ట్ర ప్రజలంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మరోపక్క బిజెపి , కాంగ్రెస్ నేతలు సైతం కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడం తో మరింత వైరల్ అయింది.

రాజ్ పాకాల ఆధ్వర్యంలో జరిగిన పార్టీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. రేవ్ పార్టీ సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం పట్టుబడింది, దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ అధికారులు ఫామ్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో అక్కడ బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం వలన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత వెల్లడించినట్లుగా, ఫామ్ హౌస్‌లో ఏమీ లభించలేదు, కానీ నిబంధనలను ఉల్లంఘించినందున కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.