కానిస్టేబుళ్లు నిరసన..సచివాలయం వద్ద సెక్షన్ 163 అమలు

Read Time:  1 min
Constables protest.Implementation of Section 163 at Secretariat
Constables protest.Implementation of Section 163 at Secretariat
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: తెలంగాణలో వివిధ బెటాలియన్లకు చెందిన కానిస్టేబుళ్లు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ‘ఏక్ పోలీస్.. ఏక్ స్టేట్’ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ వారు గత వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటివరకు 49 మంది టీజీఎస్‌పీ సిబ్బందిపై పోలీసులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇందులో 39 మందిని సస్పెండ్ చేసినట్లు మరియు 10 మందిని పూర్తిగా సేవల నుంచి తొలగించినట్లు సమాచారం.

ఈ క్రమంలో, ‘ఏక్ పోలీస్’ విధానాన్ని వెంటనే అమలు చేయాలని మరియు సిబ్బందిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, వివిధ బెటాలియన్ల కింద ఉన్న కానిస్టేబుళ్లు సోమవారం మరోసారి నిరసనలు చేపట్టనున్నారు.ఈ క్రమంలోనే వారు సచివాలయానికి ముట్టడి చేసేందుకు ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. సచివాలయ పార్కింగ్ ప్రాంగణంలో సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. అలాగే ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలలో కూడా మరికొన్ని పోలీసు బృందాలు ఉన్నాయి. సచివాలయ చుట్టూ సెక్షన్-163ని అమలు చేస్తున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.