हिन्दी | Epaper
అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

ఒరిజినల్ బాంబులకే భయపడలే.. కాంగ్రెస్ నేతల ప్రకటనకు బెదరుతామా – కేటీఆర్

Sudheer
ఒరిజినల్ బాంబులకే భయపడలే.. కాంగ్రెస్ నేతల ప్రకటనకు బెదరుతామా – కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతూ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “తాము ఒరిజినల్ బాంబులకు భయపడలేదంటే, కేవలం కాంగ్రెస్ నేతల ప్రకటనలకు భయపడతామా?” అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన బాంబుల వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్లలో మాట్లాడుతూ, ఇటీవలే మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు జరిగాయని, అందులో ఆయనే అరెస్ట్ అవ్వవచ్చని సెటైర్లు వేశారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం నుంచి వచ్చిన రూ.1,137 వేల కోట్ల నిధుల విషయంలో అమృత్ స్కామ్ గురించి ప్రస్తావిస్తూ, ఈ వ్యవహారంపై ఆయనకే చట్టం ప్రకారం విచారణ ఎదురవుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని విమర్శిస్తూ, బీజేపీ నేతలు పొంగులేటి వ్యాఖ్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

బీజేపీ నేత బండి సంజయ్‌ కూడా తమపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, ఇకపై వాటిని సహించమని హెచ్చరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులను ఎదురించి పోరాడిన తమకు కాంగ్రెస్ నేతలు పెద్దగా లెక్కకాదని, సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు.

కేటీఆర్ తన పార్టీ బీఆర్ఎస్ హామీల అమలు కోసం గట్టి పోరాటం చేస్తుందని, ముఖ్యంగా ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై బీఆర్ఎస్ వెనుకడుగు వేయబోదని స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870