📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

YCP: కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైసీపీ కైవసం

Author Icon By sumalatha chinthakayala
Updated: March 27, 2025 • 6:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YCP: కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జడ్పీ ఛైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమయింది. అయితే యాభై జడ్పీటీసీ స్థానాల్లో నలభై మందికి పైగానే వైసీపీకి చెందిన జడ్పీటీసీలు ఉన్నారు. టీడీపీకి పదిమందికి మించి లేరు. దీంతో ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమషన్ నిర్ణయించడంతో వైసీపీ తమ పార్టీకి చెందిన జడ్పీటీసీలను క్యాంప్ నకు తరలించారు. అయితే తమ గెలుపునకు అవసరమైన బలం లేకపోవడంతో టీడీపీ ఈ ఎన్నికలో పోటీకి దింపలేదు. దీంతో వైసీపీ ప్రకటించిన గోవిందరెడ్డి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.

తాము జడ్పీ చైర్మన్ రేస్‌లొ లేమని టీడీపీ ప్రకటన

అయితే, టీడీపీ తాము జడ్పీ చైర్మన్ రేస్‌లొ లేమని అధికారికంగా ప్రకటించింది. ఇక, బ్రహ్మంగారిమఠం మండలం జెడ్పీటీసీ రామ గోవిందరెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ రేసులో లేకుంటే జెడ్పీటీసీ రామ గోవింద రెడ్డి చైర్మన్ గా ఎన్నిక కావడం ఇక లాంచనమే. కాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల పరిషత్ లలో కూడా వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. అక్కడ కూడా వైసీపీ నిర్ణయించిన అభ్యర్థులే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.. ప్రొద్దుటూరులో ఉప సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగునున్నాయి. టీడీపీకి బలం లేకపోవడంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇక, కడప జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ జెడ్పీటీసీలు అందరు క్యాంప్లో ఉన్నారు. సభ్యులకు వైసీపీ విప్ జారీ చేసింది. హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్నారు వైసీపీ జడ్పిటిసిలు.. గత నాలుగు రోజులుగా క్యాంపులో ఉన్నారు. జిల్లా పరిషత్తులో వైసీపీ సంపూర్ణ మెజార్టీ.. 50 మంది జెడ్పీటీసీలకు గాను వైసీపీలో 38 మంది జెడ్పీటీసీలు ఉన్నారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Kadapa district ZP chairman post Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.