ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పంజాగుట్ట పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. అన్వేష్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో, ఆయన దేశంలో ఏ విమానాశ్రయంలో అడుగుపెట్టినా వెంటనే అదుపులోకి తీసుకునేలా పోలీసులు ఈ నోటీసులను అన్ని ఎయిర్పోర్టులకు పంపారు.
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్
ఈ వివాదం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. అన్వేష్ తన వీడియోల్లో దేవుళ్ల ఉనికిని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. పోలీసుల విచారణకు హాజరుకాకుండా విదేశాల నుండి వీడియోలు విడుదల చేయడం దర్యాప్తు సంస్థలకు సవాల్గా మారింది. దీంతో పంజాగుట్ట పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ, కేవలం లుకౌట్ నోటీసులకే పరిమితం కాకుండా ఆయన సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయాలని (Block) కూడా భావిస్తున్నారు. ఈ పరిణామం యూట్యూబ్ కమ్యూనిటీలో పెద్ద చర్చకు దారితీసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మతపరమైన విశ్వాసాలను కించపరిస్తే చట్టపరమైన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేదానికి ఈ కేసు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com