📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest Telugu News : Yatindra Siddaramaiah : సీఎం మార్పుపై యతీంద్ర సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sudha
Updated: December 9, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య ను తప్పించి.. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ ను సీఎంగా కాంగ్రెస్‌ అదిష్ఠానం నియమించ బోతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం వేళ సీఎం సిద్ధూ కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య (Yatindra Siddaramaiah) తాజాగా స్పందించారు. ఈ మేరకు కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలను తోసిపుచ్చారు. తన తండ్రి ఐదేండ్ల పూర్తి పదవీకాలం సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

Read Also: Interpol: గోవా క్లబ్ యజమానులకు ఇంటర్‌పోల్ ‘బ్లూ కార్నర్ నోటీస్’? అయ్యో

Yatindra Siddaramaiah

ఈ సందర్భంగా యతీంద్ర (Yatindra Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సీఎం పదవిని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నందున నాయకత్వ మార్పుపై గందరగోళం తలెత్తిందన్నారు. అయితే, పార్టీ హైకమాండ్‌ మాత్రం ఇప్పటికీ నాయకత్వ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేసినట్లు తెలిపారు. ‘సీఎల్పీ సమావేశంలో ఎన్ని సంవత్సరాలు అనే దాని గురించి చర్చించరు. వారు కేవలం సీఎంని మాత్రమే నిర్ణయిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పు ఉండదని హైకమాండ్‌ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య ఐదేండ్లు సీఎంగా ఉంటారని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. రాష్ట్రంలో నాయకత్వ మార్పుకు ఎలాంటి కారణం కనిపించడం లేదు’ అని యతీంద్ర అన్నారు. ఇక యతీంద్ర వ్యాఖ్యలకు డీకే స్పందిస్తూ.. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాష్ట్రానికి మంచి జరగనివ్వండి.. మంచి జరగనివ్వండి’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారు రెండున్నరేళ్ల పాలన పూర్తయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News CM change Karnataka politics latest news Political News Siddaramaiah Telugu News Yatindra Siddaramaiah

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.