📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకుంటారా? : మంత్రి పొన్నం

Author Icon By sumalatha chinthakayala
Updated: March 14, 2025 • 1:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ మీద సీరియస్ అవ్వడమే కాకుండా.. క్లారిఫికేషన్ కోసం టైం ఇచ్చినా.. తన తప్పు ఒప్పుకుని సారీ చెప్పకుండా నేను ఏం తప్పు మాట్లిడినా అని అనడం సరికాదని.. అందుకే స్పీకర్ చర్యలు తీసుకున్నారని వివరించారు.

అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?

అంతేకాకుండా తాను, సీతక్క సభలో పక్కపక్కనే కూర్చుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఫొటోలు తీశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టేదుండే అని కేటీఆర్ అన్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు శాసన మండలి చైర్మన్‌ పై కాగితాలు పడేశారని తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని గులాబీ పార్టీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు వేశారు.

నిరసనకు దిగడం హస్యాస్పదం

ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వాళ్లే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికం అంటూ అసెంబ్లీ అవరణలో నిరసనకు దిగడం హస్యాస్పదమని అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ కి కనీస జ్ఞానం రావాలని అన్నారు. సభలో ఎలా ఉండాలో.. సభా వేదికపై ఎలా ప్రవర్తించాలో తెలిసి కూడా అలా చేస్తున్నారంటే.. వారిలో ఏదో దుర్భుద్ధి ఉందనేది స్పష్టం అర్థం అవుతోందని విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu minister ponnam Paper Telugu News speaker Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.