తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కృషి ఎంతగానో దోహదపడిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి కల్వకుంట్ల కుటుంబ పాలనను ప్రజల అద్భుతమైన విశ్వాసంతో ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చారు” అని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘనత దక్కుతుందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి బేస్ కాంగ్రెస్ హయాంలోనే
హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పునాది పడిందని ఖర్గే గుర్తు చేశారు. “హైదరాబాద్ ఈరోజు ఇండస్ట్రియల్ హబ్గా నిలవడానికీ, ఐటీ, ఔషధ పరిశ్రమలు వంటి పెద్ద సంస్థల స్థాపనకూ మూలం కాంగ్రెస్ పాలననే” అన్నారు. గతంలో తీసుకున్న పాలనా నిర్ణయాలే ఈరోజు తెలంగాణ అభివృద్ధికి దారి చూపుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ గవర్నెన్స్ ఫలితంగా రాష్ట్రానికి మౌలిక వసతుల స్థాయిలో పురోగతి వచ్చిందని వివరించారు.
11 ఏళ్లలో మోదీ తెలంగాణకు ఏమిచ్చారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)ని ప్రశ్నిస్తూ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. “గత 11 ఏళ్లలో మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు? ఎన్నికల ముందు చెప్పిన 15 లక్షల వాగ్దానం ఏమైంది? ఏటా రెండు కోట్ల ఉద్యోగాల మాటలే తప్ప నిజమైన జాబ్స్ ఎక్కడ?” అని నిలదీశారు. బీజేపీ పాలనలో సామాజిక న్యాయం, అభివృద్ధి రెండూ లేనిచోటుగా భారత్ మారిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మోదీకి గుణపాఠం చెబుతారని, ఇకపై రాజ్యాంగ విలువలతో కూడిన పాలన కోసం కాంగ్రెస్నునే వృద్ధిపరిచి దేశం మొత్తానికి మార్గదర్శిగా నిలబెట్టాలన్న పిలుపునిచ్చారు.
Read Also : Hyderabad : 60వేల ఉద్యోగాలిచ్చాం.. కాదని నిరూపిస్తే క్షమాపణ చెబుతా – సీఎం రేవంత్