📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: అమిత్‌ షా !

Author Icon By sumalatha chinthakayala
Updated: February 26, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం..

కోయంబత్తూర్‌: కేంద్రమంత్రి అమిత్‌ షా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని పేర్కొన్నారు. అటువంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని ఆయన అక్కడి ప్రజలను కోరారు. అధికార డీఎంకే ప్రభుత్వంపై ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. 2026 ఎన్నికల్లో దేశ వ్యతిరేక పార్టీ అయిన డీఎంకే ఓటమి పాలవుతుందని.. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీ పై విశ్వాసంతో తమకు అధికారం

బీజేపీకి 2024 చారిత్రాత్మక ఏడాదిగా నిలిచిందని షా అన్నారు. అదే ఏడాది నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా ఎన్నికయ్యారని.. చాలా ఏళ్ల తర్వాత అంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ ప్రజలు బీజేపీ పై విశ్వాసంతో తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తూ.. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ద్వి భాషా సూత్రానికే కట్టుబడి

జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్వి భాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందిస్తూ.. తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదు అని స్పష్టం చేశారు. దీనిపై తమిళనాడు నేతలకు, కేంద్రానికి మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోన్న వేళ తమిళ భాషను కీర్తిస్తూ అమిత్‌ షా ప్రసంగించడం గమనార్హం.

assembly elections BJP Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Tamil Nadu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.