CM Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం: రేవంత్ కీలక వ్యాఖ్యలు

Read Time:  1 min
We will not let BJP set foot in Telangana.. Revanth key comments
We will not let BJP set foot in Telangana.. Revanth key comments
FONT SIZE
GET APP

CM Revanth Reddy : గుజరాత్‌లో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో విభజన తెచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధేయ వాదులంతా ఏకం కావాలి.. మోడీ, గాడ్సే పరివారాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. బ్రిటిష్‌ వాళ్లను తరిమికొట్టినట్టే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.

బీజేపీని అడుగు పెట్టనివ్వబోం రేవంత్

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ

నిజాం సర్కార్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్ వల్లభాయ్ పటేల్…తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని గుర్తు చేసుకున్నారు. దేశమంతా కులగణన చేపట్టాలని రేవంత్ సభా వేదిక మీద నుంచి డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన పూర్తి చేశాం. రైతులకు రుణమాఫీ చేశాం.. రాహుల్‌కి ఇచ్చిన హామీని నెరవేర్చామని ప్రకటించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ఇచ్చిన హామీ ఏమైంది..?..మోడీకి, అమిత్ షా కి ఉద్యోగాలు వచ్చాయి తప్ప యువతకు రాలేదన్నారు.

మోడీ వైఫల్యాలను ఎండగడతారన్న

ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లోక్ సభలో మైక్ ఇవ్వకపోవడాన్ని రేవంత్ ప్రశ్నించారు. మోడీ వైఫల్యాలను ఎండగడతారన్న ఉద్దేశంతోనే ఆయనకు మైక్ ఇవ్వడం లేదన్నారు. దేశంలో మోడీ పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి మణిపూర్ సంక్షోభమే సాక్ష్యమని స్పష్టం చేశారు. మోడీని నమ్మి అధికారం కట్టబెడితే రైతులకు అన్యాయం చేశారన్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతులను వంచించారన్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.