हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Veligonda : జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇష్టం – చంద్రబాబు హామీ

Sudheer
Veligonda : జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇష్టం – చంద్రబాబు హామీ

ప్రకాశం జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేసి, మార్కాపురం ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవాని పల్లెలో రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ‘జాతికి అంకితం’ అంటూ చేసిన రిబ్బన్ కటింగ్లను దొంగ నాటకాలుగా అభివర్ణించారు. 1996లోనే ఈ ప్రాజెక్టుకు పునాది వేసిన వ్యక్తిగా, దానిని తానే పూర్తి చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు జలకళ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు విశ్రాంత ఇంజనీర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకునేలా బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

మరోవైపు, మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నందుకు స్థానిక ప్రజల నుంచి ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం లభించింది. జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఒంగోలు వరకు వెళ్లే ప్రయాణ భారం తగ్గిందని, పాలనను ప్రజల చెంతకు చేర్చామని ఆయన పేర్కొన్నారు. నూతన జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రూ. 50 కోట్లు మంజూరు చేయడంతో పాటు, రూ. 1300 కోట్లతో ప్రతి ఇంటికీ నల్లమల సాగర్ నుంచి సురక్షితమైన తాగునీరు అందిస్తామని వాగ్దానం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మరియు రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా రైతులకు భూ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలైన ‘సూపర్ సిక్స్’, తల్లికి వందనం, మరియు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ వంటి కార్యక్రమాలతో రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో మార్కాపురం మరియు రాయలసీమ ప్రాంతాలను ఉద్యాన పంటల కేంద్రాలుగా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870