పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం షూటింగ్ పరంగా అనేక అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ, బిజినెస్ పరంగా అప్పుడే లాభాల బాట పట్టింది. పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ మరియు ఇతర సినిమాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి ఆలస్యమవుతూ వచ్చింది. సాధారణంగా ఒక సినిమా మేకింగ్ ఆలస్యమైతే వడ్డీల భారం పెరిగి బడ్జెట్ అదుపు తప్పుతుంది, దీనివల్ల నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. తన వల్ల జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పవన్ కళ్యాణ్ తన పారితోషకాన్ని భారీగా తగ్గించుకోవడం ఈ సినిమాకు కలిసొచ్చింది. ప్రస్తుతం పవన్ మార్కెట్ రేటు రూ. 60 కోట్లు ఉన్నప్పటికీ, ఈ చిత్రం కోసం ఆయన కేవలం రూ. 30 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం, ఇది నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చింది.
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ: ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపలు!
ఈ చిత్రం బడ్జెట్ వడ్డీలతో కలిపి రూ. 150 కోట్లు దాటినప్పటికీ, ప్రీ-రిలీజ్ బిజినెస్తోనే నిర్మాతలు సురక్షితమైన స్థితిలో ఉన్నారు. సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే సుమారు రూ. 80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు థియేట్రికల్ హక్కులు, శాటిలైట్ మరియు ఇతర విభాగాల ద్వారా మొత్తం బిజినెస్ రూ. 200 కోట్ల మార్కును సులువుగా తాకనుంది. అంటే విడుదల కంటే ముందే నిర్మాతలు భారీ టేబుల్ ప్రాఫిట్తో ఉన్నారని స్పష్టమవుతోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ కావడంతో, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, పవన్కు అదనపు పారితోషకం ఇచ్చే అవకాశం కూడా ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :