అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) తీసుకున్న నిర్ణయాలు భారత్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాల (టారిఫ్స్) కారణంగా అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగి, ఎగుమతులు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ‘మిత్ర దేశం’ అని చెప్తూనే, భారత్పై అత్యధిక సుంకాలు విధించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్ తర్వాత అత్యధిక సుంకాల భారం ఎదుర్కొంటున్న దేశం భారత్ కావడం గమనార్హం.
ఇతర దేశాలపై ప్రభావం
భారత్(India)తో పాటు బ్రెజిల్ (50%) కూడా అత్యధిక సుంకాలు ఎదుర్కొంటోంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ (39%), కెనడా (35%), చైనా (30%) వంటి దేశాలపై కూడా ట్రంప్ సుంకాలు విధించారు. అయితే భారత్, బ్రెజిల్తో పోలిస్తే ఈ దేశాలపై ప్రభావం కొంత తక్కువగానే ఉంది. ట్రంప్ భవిష్యత్తులో ఈ సుంకాల శాతాన్ని ఇంకా పెంచుతానని హెచ్చరించడంతో, ప్రపంచ వాణిజ్యంపై దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.
భవిష్యత్ సంబంధాలపై ఆందోళన
ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్స్ నిర్ణయాలతో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇరు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ అమెరికాకు ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఈ టారిఫ్స్ యుద్ధం వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాలు చర్చలకు ముందుకు రావడం అనివార్యం. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.
Read Also : DK & Komatireddy : డీకే శివకుమార్ కోమటిరెడ్డి భేటీ