📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 4, 2025 • 8:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగాలి. అందుకు ఎస్వీయూ సెనేట్‌ హాలులో ప్రిసైడింగ్‌ అధికారి శుభం బన్సల్‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ, కోరం లేకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్‌ ప్రకటించారు. 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. 22 మంది మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. 50 శాతం కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా అనివార్యమైంది.

కాగా, తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు 22 మంది కూటమికి మద్దతు తెలిపారని, మరో 6 మంది రేపు ఉదయం వస్తారని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలు అందరూ చూశారు. తమ కార్పొరేటర్లను వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయించుకొని కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం మిస్సయిన నలుగురు కార్పొరేటర్లు తాము సురక్షితంగా ఉన్నామని వారే వీడియో ద్వారా తెలిపారు. ఎన్నిక గందరగోళం వల్ల తాము సురక్షిత ప్రాంతానికి వచ్చేశామని వారే చెప్పారు.

భూమన కరుణాకరరెడ్డి గతంలో ఎన్నో అరాచకాలు చేయగా తిరుపతి ప్రజలందరూ చూశారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కరుణాకరరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైసిపి అనేక అరాచకాలకు పాల్పడింది. దొంగ ఓటరు కార్డులు తయారు చేయించి తమిళనాడు నుంచి వ్యక్తులను ఇక్కడికి తరలించి దొంగ ఓట్లు వేయించారు. మేం ఎలాంటి దౌర్జన్యాలకు, కిడ్నాప్లకు పాల్పడలేదు. తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నిక మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరగాలి. తన కొడుకు భూమన అభినయ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కరుణాకర్ రెడ్డి ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డుతున్నారని’ కిరణ్ రాయల్ మండిపడ్డారు.

Bhumana Abhinay Reddy Janasena Postponed Tirupati Deputy Mayor Election

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.