📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

pastor praveen: పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 29, 2025 • 5:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

pastor praveen : పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ ఈనెల 24న అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ కుమార్‌ తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పాస్టర్‌ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఐజీ వెల్లడించారు.

అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం

కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని ఎస్పీ డి.నరసింహకిశోర్‌ తెలిపారు. అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్‌ కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమహేంద్రవరం వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్‌కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం అని ఎస్పీ తెలిపారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Investigation Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.