📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Maoist movement: మావోయిస్టు ఉద్యమానికి చుక్కెదురు

Author Icon By Pooja
Updated: September 24, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చర్ల: గడిచిన ఏడాదిన్నర కాలంలో మావోయిస్టు ఉద్యమం మునుపెన్నడూ లేని విధంగా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశం చూస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నిజమవుతుందా అన్న సందేహాలు, చర్చలు మొదలయ్యాయి. తాజా పరిస్థితులు కేంద్ర కమిటీ సభ్యులపై కేంద్రీకరించిన ఆపరేషన్లతో ఉద్యమం నీరుగారుతోందని సూచిస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో(encounter) కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి (కదారి సత్యనారాయణ రెడ్డి) మృతి చెందడం మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా మారింది. ఈ ఎన్‌కౌంటర్ కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత కేంద్ర కమిటీ స్థాయి నాయకులు మరణించడం ఇదే ప్రధమం.

మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు మృతి తర్వాత పార్టీ దిశా నిర్దేశం లోపించింది. ఇటీవల సోను పేరిట విడుదలైన లేఖలో ఆయన చర్చలకు సిద్ధమని వెల్లడించగా, అది వ్యక్తిగత అభిప్రాయమేనని పార్టీ చెబుతూ విభేదాలు బయటపెట్టింది. ఈ పరిస్థితి ఉద్యమం అంతర్గత సంక్షోభాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.

కోవర్ట్ ఆపరేషన్ల విజయాలు, మావోయిస్టుల గందరగోళం

ఇక, కోవర్ట్ ఆపరేషన్ల దెబ్బతో గత నెలరోజుల్లో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందగా, ఒకరు లొంగిపోయారు. అగ్రనాయకత్వాన్ని ఏరివేస్తున్న భద్రతా వ్యవస్థ పనితీరుతో మావోయిస్టులలో తీవ్ర గందరగోళం(Extreme confusion) నెలకొంది. మరోవైపు పౌరసమాజం, మానవ హక్కుల సంఘాలు ఎన్‌కౌంటర్లపై ప్రశ్నించినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. “శరణమా.. మరణమా” అన్న కేంద్రం స్పష్టమైన సందేశం నేపథ్యంలో, మావోయిస్టులలో కొందరు లొంగుబాటుకే మొగ్గుచూపుతున్నారని సమాచారం.

ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎవరు మృతి చెందారు?
ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి (కదారి సత్యనారాయణ రెడ్డి) మృతి చెందారు.

మావోయిస్టు ఉద్యమానికి ఎందుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి?
భద్రతా దళాలు కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేస్తుండటమే ప్రధాన కారణం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Chhattisgarh Covert Operations encounter Latest News in Telugu Maoist Movement Naxals Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.