📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Akhilesh : కూటమి చెక్కుచెదరదు బలంగా వుంది : అఖిలేష్‌ యాదవ్‌

Author Icon By Sudha
Updated: June 17, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA alliance) పని అయిపోయిందని, ఆ కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత లేదని జరుగుతున్న ప్రచారంపై ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM), సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) స్పందించారు.

Akhilesh : కూటమి చెక్కుచెదరదు బలంగా వుంది : అఖిలేష్‌ యాదవ్‌

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రతిపక్ష INDIA కూటమిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. “INDIA కూటమి పని అయిపోయిందని” ఎన్ని కథనాలు వచ్చినా అది నిజం కాదని, ఇది బీజేపీతో పోరాడే ప్రతిపక్ష బలాన్ని తగ్గించేందుకు చేసిన దుష్ప్రచారం మాత్రమేనని ఆయన తెలిపారు. ఇండియా కూటమి చెక్కుచెదరదని, బలంగా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.
చెక్కుచెదరదు
‘ఇండియా కూటమి బలంగా ఉంది. అది చెక్కుచెదరదు. ఎవరైనా కూటమి నుంచి వెళ్లిపోవాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు. ఎవరూ ఆపరు. అంతేగానీ కూటమిలో ఉంటూ కూటమిని పలుచన చేసే వ్యాఖ్యలు చేయొద్దు’ అని అఖిలేష్‌ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తాచాటుతుందని అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం లక్నోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. మహాకుంభమేళా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అందుకు సంబంధించిన పేర్లను ఎందుకు వెల్లడించడంలేదని ప్రశ్నించారు.

Read Also:Air India: ఢిల్లీ-రాంచీ ఎయిరిండియా విమానంలో సమస్య

#AkhileshYadav #BJPVsINDIA #IndiaAlliance #LanguageUnity #OppositionUnity #PoliticalStrategy #SamajwadiParty akhilesh yadav Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The alliance is unbreakable there is only one goal: Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.