📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి

Author Icon By sumalatha chinthakayala
Updated: February 26, 2025 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన ఆర్మీ అధికారులు

శ్రీనగర్‌: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో సుందర్‌బని మల్లా రోడ్డు వద్ద ఫాల్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

అదనపు బలగాలు

సుమారు రెండు రౌండ్లు ఫైరింగ్‌ జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు. కాగా, సరిహద్దు సమీపంలోని ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాట్లు సాధారణమని ఆర్మీ అధికారులు తెలిపారు. పెట్రోలింగ్ వాహనంపై కాల్పుల సంఘటన నేపథ్యంలో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం కూంబింగ్‌ జరుగుతున్నదని వెల్లడించారు.

పాకిస్థాన్‌ చొరబాటుదారుడు

మరోవైపు పంజాబ్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ చొరబాటుదారుడ్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. పఠాన్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పాకిస్థాన్‌ చొరబాటుదారుడ్ని గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ దళాలు అతడ్ని వారించాయని, అయినప్పటికీ చొరబాటుకు యత్నించగా కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.

Army vehicle Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online Terrorist attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.