Elections-నేడు (మంగళవారం) ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్(Elections Polling) జరుగుతుంది. ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5వరకు కొనసాగనుంది. పార్లమెంటు నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజతను ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సి.పి.రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడనున్నారు.
పోలింగ్ లో పాల్గొనని బీఆర్ఎస్, బిజెడి
పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సంఖ్య 788 అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాలీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగ్ లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, ఆర్ జెడి ప్రకటించాయి. దీనిప్రకారం 386ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలవనున్నారు. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. దీంతో ఎన్టీయే అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమనే చెప్పాలి. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య ఓటింగ్ ద్వారా ఓకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రతినిధ్యవ్యవస్థకు అనుగుణంగా పార్లమెంటు ఉభయసభల(Both Houses of Parliament) సభ్యులందరితో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒకసారి ఎన్నుకోబడిన వైస్ ప్రెసిడెంట్ ఐదేళ్ల పదవీకాలం పాటు పదవిలో కొనసాగుతారు. 2024 వరకు 14మంది ఉపాధ్యక్షులుగా పనిచేసారు.
భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాక
ష్ణన్ 1952 మే 13న రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎం.వెంకయ్యనాయుడు పదవి కాలం ముగిసిన తర్వాత 2022 ఆగస్టు 11న 14వ ఉపాధ్యక్షుడిగా జగదీష్ ధశేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే తన పదవికి రాజీనామా చేయడంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. రెండు ప్రధాన కూటముల ఎంపీలు ఒకొక్కక్కరుగా పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలోకి చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ ఎన్డీయే తరపున తొలి ఓటు వేశారు. సాయంత్రం ఐదుగంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఓటు వేయగలరు?
లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఓటు వేయగలరు.
మొత్తం ఎంతమంది ఎంపీలు ఓటు వేస్తారు?
మొత్తం 788 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: