📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Telangana: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్!

Author Icon By Saritha
Updated: December 20, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు దక్కించుకున్నప్పటికీ, ఫలితాలపై అంతర్గతంగా సమీక్షలు జరుగుతున్నాయి. తమకు లభించిన స్థానాల పట్ల బీఆర్ఎస్(BRS) నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించిందని వారు విశ్లేషిస్తున్నారు. (Telangana) ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. రాబోయే ఎన్నికలను 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పరీక్షగా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.

Read also: Telangana: వారికి KCR కీలక బాధ్యతలు

The date for the municipal elections has been fixed!

మునిసిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ కసరత్తు

త్వరలోనే మునిసిపల్(Telangana) ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే జనవరిలోనే ఈ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ, న్యాయపరమైన అంశాలు అడ్డంకిగా మారాయి. మరోవైపు, పాలక వర్గాలు లేని కారణంగా పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.3 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ నిధులు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో పాత రిజర్వేషన్ విధానంలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. మునిసిపల్, పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగే కారణంగా బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం కీలకంగా మారింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న కోర్టుల ఆదేశాల నేపథ్యంలో, బీసీలకు పార్టీ స్థాయిలో 42 శాతం సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ముందుగా మునిసిపల్ ఎన్నికలు, అనంతరం పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Anti-Incumbency congress Latest News in Telugu local body elections Political Analysis Rural Telangana Telangana Elections Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.