हिन्दी | Epaper
కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

Latest News: Telangana: పిల్లాడి ఇంటి ముందు టీచర్ల ధర్నా

Saritha
Latest News: Telangana: పిల్లాడి ఇంటి ముందు టీచర్ల ధర్నా

బడికి వస్తావా… మమ్మల్ని ఇంటికి రమ్మంటావా? అన్న నినాదంతో భద్రాచలం ఐటీడీఏ (ITDA) పరిధిలోని ఉపాధ్యాయులు(Telangana) డ్రాపౌట్‌లను తగ్గించేందుకు వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నంలో భాగంగా, వారు ఏకంగా ఓ విద్యార్థి ఇంటి ముందు ధర్నాకు దిగారు. విద్యా హక్కును పరిరక్షించడం మరియు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులకు చేర్చడం తమ బాధ్యతగా గుర్తించినందునే ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు రవి తెలిపారు. భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం మండలం, నిమ్మలగూడెంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. స్థానిక గిరిజన పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న నక్క మనోవరుణ్ అనే విద్యార్థి వారం రోజులుగా పాఠశాలకు రావడం మానేశాడు.

Read also: భోజనం తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా..

Telangana
Teachers protest in front of child’s house

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ఆందోళన

మనోవరుణ్(Telangana) బడికి డుమ్మా కొట్టడంతో, ఉపాధ్యాయులు ముందుగా అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థిని బడికి పంపాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఇంటికి వెళ్లినా, మనోవరుణ్ మాత్రం పాఠశాల(School) బాట పట్టలేదు. మనోవరుణ్‌కు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు పంపడం లేదని ఉపాధ్యాయులు గుర్తించారు. దీంతో వారు తల్లిదండ్రులను మరింత గట్టిగా ప్రశ్నించారు. చదువుకోవాల్సిన పిల్లలను పనికి పంపిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని వారికి స్పష్టంగా తెలియజేశారు. అయినప్పటికీ, వారిలో మార్పు కనిపించకపోవడంతో, మాటలతో ప్రయోజనం లేదనుకున్నారు. అందుకే, టీచర్లు మిగతా విద్యార్థులను వెంటబెట్టుకుని మనోవరుణ్ ఇంటి ముందు కూర్చుని ధర్నాకు దిగారు. పిల్లాడి భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పడుతున్న ఈ అసాధారణమైన శ్రమను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వారు కూడా ఉపాధ్యాయులకు అండగా నిలబడ్డారు. దీంతో, మనోవరుణ్ తల్లిదండ్రులు దిగివచ్చి, తమ కుమారుడిని ఖచ్చితంగా బడికి పంపిస్తామని హామీ ఇచ్చారు. వారి హామీతో ఉపాధ్యాయులు తమ ధర్నాను విరమించారు. పిల్లల్ని బడిబాట పట్టించడం కోసం ఐటీడీఏ అధికారులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఈ కృషిని స్థానికులు ఎంతగానో అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870