మహానాడు (Mahanadu 2025) నిర్వహణను విజయవంతంగా పూర్తి చేయడానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) భారీ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు కడప జిల్లాలో జరగనున్న ఈ మహానాడుకు సంబంధించి మొత్తం 19 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి సంబంధించి నాయకులను బాధ్యతలతో నియమించి, సమగ్ర సమన్వయంతో కార్యక్రమాన్ని నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్య కమిటీలకు ప్రముఖుల నేతృత్వం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీ ఏర్పాటవగా, రాష్ట్ర విద్యా మరియు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ సమన్వయ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. అచ్చెన్నాయుడు వసతుల కమిటీకి, యనమల రామకృష్ణుడు తీర్మానాల కమిటీకి అధిక్షతగా ఉన్నారు. అంతేకాక, ఆహ్వాన కమిటీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మరియు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు నేతృత్వం వహిస్తున్నారు.
కడప వేదికను ఎంచుకోవడం గమనార్హం
ఈ సారి కడప జిల్లాను మహానాడు వేదికగా ఎంచుకోవడం గమనార్హం. ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ప్రజల్లో విశ్వాసం నిలబెట్టుకోవడమే కాక, పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు ఇవ్వడం, భవిష్యత్తు కార్యాచరణను తీర్మానించుకోవడమే లక్ష్యంగా ఈ మహానాడు జరగనుంది. మూడు రోజులపాటు నిర్వహించే ఈ మహాసభల్లో పార్టీలోని అన్ని స్థాయిల నేతలు పాల్గొని భావి కార్యాచరణపై చర్చించనున్నారు.
Read Also : Notice : కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు