టీ-20 వరల్డ్కప్లో భాగంగా యూఎస్ఏ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై వేదికగా భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.మరికాసేపట్లో మ్యాచ్ మెదలుకానుంది. కాగా సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా ఈ మ్యాచ్కు దూరమైనట్లు కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించారు.
Read Also: హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగినా అప్రిలియా RS457 ట్రాక్ డే వేడుక
మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.టీమిండియా అందరూ ఊహించినట్టుగానే ఇషాన్ కిషన్ని ఓపెనర్గా పరిచయం చేస్తూ జట్టును ప్రకటించింది. వాషింగ్టన్ సుందర్ పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. జస్ప్రీత్ బుమ్రాకి ఈ మ్యాచ్లో రెస్ట్ ఇవ్వడంతో హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన మొహమ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్లో ఛాన్స్ కొట్టేశాడు.
టీమిండియా జట్టు
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దుబే, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
యూఎస్ఏ జట్టు
ఆండ్రీస్ గౌస్, సాయితేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్ (కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే, హర్మీత్ సింగ్, మొహమ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: