Breaking News – Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్

Read Time:  1 min
Breaking News – Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్
FONT SIZE
GET APP

తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ ఉద్రిక్తత వాతావరణంలో కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ, బీసీ సంఘాలు ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే బంద్ అమలు ప్రారంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా RTC డిపోలకు వెళ్లి బస్సులను అడ్డుకోవడం, రోడ్డు రోకోలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రజలు ఆవసరమైన ప్రయాణాలు మినహా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Latest News: Jatadhara: ‘జటాధర’ ట్రైలర్ రిలీజ్

ఈ బంద్‌కు ప్రభుత్వాన్ని సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం విశేషం. అధికార కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్ష BRS, BJP, CPM, CPI పార్టీలు కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రజల్లో ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు మద్దతు ఇస్తే, ఈ బంద్ ఎవరిపై జరుగుతోందనే ప్రశ్న కూడా చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ బీసీ సంఘాలు తమ ప్రధాన డిమాండ్ అయిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయి.

ఇక బంద్ ప్రభావం సాధారణ ప్రజలపై కూడా పడుతోంది. మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని, ప్రజలు సహకరించాలని బీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ప్రభుత్వం చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసులు మోహరించింది. బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.