Latest news: Srikalahasti: కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి

Read Time:  1 min
Srikalahasti
Srikalahasti
FONT SIZE
GET APP

చైర్మన్ సాయి సహా 15 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం

శ్రీకాళహస్తి : శ్రీకాళ హస్తీశ్వరాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ నామినేట్ చేసిన జనసేనకు చెందిన కొట్టె సాయి ప్రసాద్(Srikalahasti) ఆలయంలోని మహిమాన్విత అంజంజి వినాయకుని ఆలయం వద్ద ప్రమాణ స్వీకారం వేసారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీగా విచ్చేసారు. ప్రమాణ ద్వికారానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి, జంగాలపల్లి నివాసులు, ఆరవ శ్రీధర్, హస్తకళల నైపుణ్యా, వృద్ది సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, మాజీ శాసనసభ్యుడు ఎస్ సివి నాయుడు హాజరయ్యారు. ఆలయంలో మహిమాన్వితమైన అంజంజి వినాయ మని ఆలయం వద్ద ప్రమాణం చేయాలని నిర్ణయిం వారు. దాంతో కొంత గందరగోళ పరిస్థితి చోటు వేసుకుంది. ఇక్కడ స్థలం తక్కువ కావటం అక్కడ నుంచి రూ.500ల రాహుకేతుదోష నివారణ పూజ ఎకు వెళ్ళు భక్తులకు అంతరాయం కల్గింది. ప్రమాణ ణ్వకారం సందర్భంగా అధికారులు, పాలకుల మన్వయ లోపం స్పష్టంగా కనబడింది. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీకాళ వాస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలిలో 16 మంది సభ్యులను నియమించారు.

Read also: కోట్ల ఇన్సూరెన్స్ మోసం..తల్లిదండ్రులు, భార్యను హత్య చేసిన కుమారుడు

Srikalahasti
Srikalahasti: కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి

భక్తుల మనోభావాలకు అనుగుణంగా సేవలు అందించాలని నిర్ణయం

వారిలో ఈ నెల 24న జెపి సభ్యురాలు కోలా విశాలాక్షి, తెలుగుదేశం సభ్యులు వాకచర్ల గుర్రప్ప, గోపినాధ్, లక్ష్మమ్మ ప్రమాణం చేయగా ఆదివారం తెలుగుదేశం పార్టీకి (Srikalahasti) చెందిన బీలా స్రవంతి (ఎలమంచిలి), చిన్నప్రోలు లక్ష్మినారాయణ (పుట్టవర్తి), కుసుమ కుమారి.కె ఇంగోలు), కొమ్మనబోయిన రజని (చీరాల), కొప్పర్ల దాగరాజు (చింతలపూడి), కొమ్మూరి విజయమ్మ (నెల్లూరు సిటి), రుద్రాక్షల కౌసలమ్మ (వెంకటగిరి), కల్బె సావిత్ర (రాజంపేట), పెనగలూరు హేమావతి (కడప), జనసేనకు చెందిన దండి రాఘవయ్య (శ్రీకాళహస్తి), పగడాల మురళి (తిరుపతి)లు ప్రమాణ స్వీకారం చేసారు. తెలంగాణకు చెందిన ప్రకాష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఎక్స్ ఆఫీషియో సభ్యుడుగా ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన సంబంధం గురుకుల్కు అవకాశం కల్పించారు. కొత్త బోర్డు గతంలో పని చేసిన వాకచర్ల గుర్రప్పశెట్టిలు ఉన్నారు. ఆదివారం సభ్యులచే ఆలయ ఇఓ డి. బాపి రెడ్డి శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి పర్యవేక్షణలో ఒకేసారి ప్రమాణం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గం ఆదివారం సమావేశం హాలులో మొదటి సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అలాగే కలసికట్టుగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించాలని సూచించారు.

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.