శ్రీలంకలోని మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ యుద్ధ విమానాలను ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా కోరినప్పటికీ, ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4 మరియు 8 తేదీల్లో వచ్చిన రెండు వేర్వేరు అభ్యర్థనలను శ్రీలంక ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన అధ్యక్షుడు.. అగ్రరాజ్యం నుండి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ తమ దేశ సార్వభౌమాధికారం మరియు తటస్థ విధానానికే మొగ్గు చూపినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా మట్టాల ఎయిర్పోర్ట్ వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం, అక్కడ అమెరికా సైనిక కార్యకలాపాలకు తావిస్తే ప్రాంతీయ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
Read Also : Petrol : పెట్రోల్, డీజిల్ ధరలపై IOCL కీలక ప్రకటన
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో (Middle East) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధ వాతావరణం సవాళ్లు విసురుతున్న తరుణంలో, ఏ ఒక్క దేశానికి లేదా కూటమికి కొమ్ముకాయకుండా ‘న్యూట్రల్’ (తటస్థంగా) ఉండటమే తమ లక్ష్యమని దిస్సనాయకే ప్రకటించారు. గతంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సమయంలో చైనాకు అనుకూలంగా ఉందనే ముద్ర పడ్డ శ్రీలంక, ఇప్పుడు కొత్త ప్రభుత్వం హయాంలో తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని చాటుకుంటోంది. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు లొంగబోమని కుండబద్ధలు కొట్టడం ద్వారా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శ్రీలంక తన ఉనికిని మరియు ఆత్మగౌరవాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :