📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Sri Bharat: వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించిన శ్రీభరత్

Author Icon By Saritha
Updated: November 10, 2025 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం(Sri Bharat) టీడీపీ(TDP) ఎంపీ శ్రీభరత్ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి అనే పదం వైసీపీ నేతలకు తెలియదని, విధ్వంసం చేయడంలో మాత్రం వారు పీహెచ్‌డీ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరులో మార్పు రాలేదని వ్యాఖ్యానించారు.

శ్రీభరత్ విశాఖలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘యూనిటీ మార్చ్’లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తుంటే, అదే సమయంలో వైసీపీ ర్యాలీలు నిర్వహించడం దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: మేడారం జాతరకు ఏర్పాట్లు: విద్యుత్ చౌర్యం ఇక కుదరదు

Sri Bharat: వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించిన శ్రీభరత్

పెట్టుబడుల సదస్సు సమయంలో వైసీపీ ర్యాలీలపై తీవ్ర ఆగ్రహం

వైసీపీ(Sri Bharat) పాలనలో పెట్టుబడిదారులు భయపడి రాష్ట్రాన్ని వదిలి వెళ్లారని శ్రీభరత్ అన్నారు. పెట్టుబడుల సదస్సు ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు ముఖ్యమా లేదా స్వార్థ రాజకీయాలా అనేది ఆలోచించాలన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోయే సదస్సులో రూ. 9.8 లక్షల కోట్ల విలువైన 410కు పైగా అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం కేవలం 17 నెలల్లోనే రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.

రుషికొండపై అనవసరంగా ఖర్చు చేసిన డబ్బుతో ఉత్తరాంధ్రలో పలు మెడికల్ కళాశాలలు నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. హత్యలు చేసినవారికి మంత్రిత్వ పదవులు, అసభ్యంగా మాట్లాడినవారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన పాలన జగన్మోహన్ రెడ్డి దే అని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే, గంజాయి కేసుల్లో ఉన్నవారిని పరామర్శించే ధైర్యం కూడా జగన్‌దే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయడం, యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం అని శ్రీభరత్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradesh development Investments JaganMohanReddy Latest News in Telugu Politics SriBharat TDP Telugu News visakhapatnam YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.