📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest Telugu News: Chevella: ట్రైన్ మిస్..బస్ ఎక్కి మృత్యువుకు చేరువైన అక్కాచెల్లెళ్లు

Author Icon By Vanipushpa
Updated: November 3, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అయ్యో దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. నా పిల్లలు లేకుండా నేను బ్రతికేదేలా! నా పిల్లల్ని నాకివ్వండయ్యా అంటూ బోరున విలపిస్తున్న ఈ తల్లి ఆవేదన గుండెల్ని పిండేస్తుంది. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ముగ్గురు బిడ్డల మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ పని చేస్తూ తన ముగ్గురు కూతుళ్లను చదివిస్తున్నాడు. ఓ పెళ్లి వేడుక కోసం గతనెల 17న ఇంటికి వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తిరిగి వెళ్తుండగా.. అనుకోని ఈ ప్రమాదం వారి జీవితాలను చీకటి చేసింది.

Read Also: Chevella Accident: ఇద్దరు డ్రైవర్ల మృతి తో సంక్లిష్టంగా మారనున్న దర్యాప్తు!

Chevella

ట్రైన్ మిస్ కావడంతో బస్సు ఎక్కారు

మృత్యువు ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితంలోనూ ఇదే జరిగింది. ఈరోజు ట్రైన్ లో హైదరాబాద్ రావాల్సిన ఈ ముగ్గురు.. ట్రైన్ మిస్ కావడంతో బస్సు ఎక్కారు. అదే తమ పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయారు. ఐదు నిమిషాల ఆలస్యం వారి జీవితాలనే చీకటిగా మార్చింది. ఈ పరీక్ష ఉందని చెప్పడంతో ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లను ఉదయాన్నే ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాడు. కానీ, అప్పటికే కాస్త ఆలస్యం కావడంతో ట్రైన్ మిస్సై పోయింది. దీంతో ఎల్లయ్య తన ముగ్గురు కూతుళ్లను తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కించాడు.

గుండె పగిలే వార్త!

అలా కూతుళ్లను బస్సు ఎక్కించి.. ఇంటికి వెళ్లి ఓ కునుకు తీశాడు.. ఇంతలోనే గుండె పగిలే వార్త! ఉదయం 4.40 గంటల ప్రాంతంలో తాండూరు నుంచి బయలుదేరిన బస్సు చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య ముగ్గురు కూతుళ్లును మృత్యువు కబళించింది. ఎల్లయ్యకు మొత్తం నలుగురు సంతానం కాగా.. వారిలో మొదటి కూతురికి వివాహమైంది. మిగతా ముగ్గురు కుమార్తెలు తనూషా, సాయి ప్రియా, నందిని హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు.

చేవెళ్ల ఏ రాష్ట్రంలో ఉంది?
చేవెళ్ల అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ పట్టణం, మండలం మరియు శివారు ప్రాంతం.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News Bus Accident Emotional story Google News in Telugu India News Missed Train Road Accident Sisters Telugu News Paper Telugu News Today Tragic Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.