📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

IT Ride : ఐటీ రైడ్లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

Author Icon By Sudheer
Updated: February 20, 2026 • 8:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజస్థాన్‌లో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు చేపట్టిన సోదాలు సినీ ఫక్కీలో సాగుతున్నాయి. ప్రముఖ ‘కన్హా గ్రూప్’ సంస్థలపై జరుగుతున్న ఈ దాడుల్లో ఊహించని రీతిలో రహస్య గదులు, భారీగా బంగారం బయటపడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘రైడ్’లో అజయ్ దేవగన్ గోడలు బద్దలుకొట్టి బంగారం తీసినట్లుగానే, రాజస్థాన్‌లో ఐటీ అధికారులు ఒక రహస్య గదిని కనుగొన్నారు. కన్హా గ్రూప్‌కు చెందిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తుండగా, ఒకచోట అనుమానాస్పదంగా ఉన్న గోడను లేదా గదిని అధికారులు గుర్తించారు. దానిని బద్దలుకొట్టి చూడగా, కళ్లు చెదిరే రీతిలో భారీగా బంగారు ఆభరణాలు, బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఈ రహస్య గదిలో దాచిన బంగారం విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పక్కా ప్లానింగ్‌తో పన్ను ఎగవేతకు పాల్పడేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Trump reaction obama : ఒబామా ఏలియన్ల వ్యాఖ్యలు కలకలం, రహస్యాలు వెలిబుచ్చారన్న ట్రంప్

దాదాపు రూ. 100 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే పక్కా సమాచారంతో ఐటీ శాఖ ఈ మెరుపు దాడులు చేపట్టింది. రాజస్థాన్‌లోని 6 ప్రధాన నగరాల్లో సుమారు 3 రోజులుగా ఈ సోదాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో కేవలం బంగారమే కాకుండా, రూ. 50 లక్షల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఈ గ్రూప్‌కు చెందిన 10 బ్యాంక్ లాకర్లను సీజ్ చేసి, వాటిలో ఉన్న విలువైన పత్రాలను పరిశీలిస్తున్నారు. బినామీ ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా అధికారుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది.

ఈ సోదాల్లో లభ్యమైన బంగారం మొత్తం బరువు మరియు దాని ఖచ్చితమైన విలువను లెక్కించేందుకు అధికారులు వెయింగ్ మెషీన్లను రప్పించారు. కన్హా గ్రూప్ నిర్వహించే వ్యాపార లావాదేవీల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ దాడుల ప్రక్రియ ఇంకా ముగియలేదని, లాకర్లు తెరిచిన తర్వాత మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పన్ను ఎగవేతదారులకు ఇదొక హెచ్చరిక లాంటిదని, ఆర్థిక నేరాలకు పాల్పడితే ఎంతటి రహస్య ప్రదేశాల్లో దాచినా చట్టం వదిలిపెట్టదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

IT Ride Jaipur Kanha Restaurant Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.