ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు
జూబ్లీహిల్స్(RV Karnan) అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అయ్యాయని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. పోలింగ్ సందర్భంగా అనధికారికంగా వ్యవహరించిన కొన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించి వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.
పోలింగ్ సమయంలో స్థానికేతర ప్రజాప్రతినిధులు కేంద్రాల వద్ద అనధికారికంగా ఉండడం, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు కోడ్ ఉల్లంఘనగా పరిగణింపబడతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
Read also: ‘గ్లోబ్ ట్రాటర్’ఫస్ట్ సాంగ్ సంచారి విడుదల శృతి హాసన్ వాయిస్తో గూస్బంప్స్!
పోలింగ్ వివరాలు మరియు భద్రత
మరోవైపు, బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, తమ పార్టీ కార్యకర్తలపై కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ దాడులు చేస్తున్నారని, కానీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికలు(RV Karnan) సజావుగా జరిగేలా చూడడంలో భద్రతా వ్యవస్థ బాధ్యత వహించాలి అని మాగంటి సునీత అన్నారు. ఈ ఉపఎన్నికలో 4,01,365 ఓటర్లు తమ హక్కువినియోగించనున్నారని, మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్రెడ్డి పోటీపడుతున్నారు. ఉదయం 11గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు 139 ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. పోలింగ్ నిర్వహణలో 5,000 మంది సిబ్బంది, 1,761 మంది పోలీస్, 800 మంది కేంద్ర బలగాలను బందోబస్తు కోసం నియమించబడ్డారు. మొదటిసారిగా డ్రోన్లను ఉపయోగించి కేంద్రాల సమీక్ష చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్లను అమలు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: