📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయుల మృతి..!

Author Icon By sumalatha chinthakayala
Updated: April 16, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. అమెరికాలోని రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన ఐదుగురిలో ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. వీరిలో ఒక్కరు మహిళ కూడా ఉంది. ఈ ముగ్గురు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు.వీరిలో ఇద్దరు శ్రీకాళహస్తికి చెందిన వారు ఉండగా.. మరొకరు గూడురుకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మృతులు డేగపూడి హరితా రెడ్డి, చిరంజీవి శివ, గోపి తిరుమూరు గా గుర్తించారు.

టెక్సాస్ రహదారి నంచి దక్షిణ బాన్‌హామ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదానికి ఒక్కటి బలంగా ఢీకొన్నట్లు తెలిసింది. అక్కడున్న తెలుగు వారు ఈ వార్తను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో గాయపడిన చెన్ను సాయి తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కాణాలు తెలియరాలేదు. రాంగ్‌రూట్‌లో వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

గతంలో కూడా అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి తెలుగు వారు మృతి చెందారు. సెప్టెంబర్ లో అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయలు చనిపోయారు. టెక్సాస్‌లోని అన్నాలో యుఎస్ రూట్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన నలుగురిలో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. మరొకరు చెన్నైకి చెంది వారు. ఒకేసారి ఐదు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27),ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల (28) ఉన్నారు. మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తించారు.

America Guduru Indians died Road Accident Srikalahasti

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.